‘సర్‌’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.!

పదో తరగతి ఫెయిల్‌ అయ్యాయనే భయంతో ఇంటి నుంచి పారిపోయిన కుర్రాడు.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కన్న వారిని, పుట్టిన వారిని తిరిగి చేరుకున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు పుత్ర వాత్సల్యాన్ని మళ్లీ అందించాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా ఈ హృదయాలను కదిలించే సంఘటన చోటుచేసుకుంది.

A son ran away from home thirty years ago reunited with his family SIR process

1996లో, కర్నూలులోని ఎమ్మాగనూరు నివాసి అయిన రామ, 10వ తరగతిలో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటి నుంచి పారిపోయాడు. 30 ఏళ్ల తర్వాత బెంగళూరులో స్థిరపడాక, ఎన్నికల సంఘం వారి SIR ఫారంలో తన తల్లిదండ్రుల చిరునామాను చూసి అతని మనసు కరిగిపోయింది, దాంతో అతను తిరిగి వచ్చాడు. వృద్ధులైన తన తల్లిదండ్రులను కలిసినప్పుడు అతను కన్నీరుమున్నీరుగా ఏడ్చాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 1996లో పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాక, కుటుంబం నిందిస్తుందనే భయంతో ఇంటి నుంచి పారిపోయిన ఒక యువకుడు, 30 ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు. మూడు దశాబ్దాలుగా తమ కుమారుడి కోసం నిరీక్షించి వృద్ధులైన ఆ తల్లిదండ్రులు ఎట్టకేలకు తిరిగి కలుసుకున్నప్పుడు, ఆ ప్రాంతమంతా ఆనంద భాష్పాలతో నిండిపోయింది. ఎన్నికల సంఘం జారీ చేసిన అధికారిక ఎస్ఐఆర్ (SIR) ఫారం ద్వారా ఈ విడదీయరాని కలయిక సాధ్యమైంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నివాసులైన ఎల్లమ్మ, ఎల్లప్ప దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమారుడు రాముడు, 1996లో 10వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. అతని మామయ్య కుమారుడైన నాగరాజు కూడా ఫెయిల్ కావడంతో.. ఇరు కుటుంబాల నుంచి మందలింపులు ఎదురయ్యాయి. దీంతో భయంతో రాముడు, నాగరాజు ఇంటి నుంచి పారిపోయారు.

ఆరేళ్ల తర్వాత నాగరాజు తిరిగి ఇంటికి చేరుకోగా.. రాముడు మాత్రం భయంతో ముంబై, పుణె, బెంగళూరు వంటి నగరాల్లో సంచరిస్తూ ఏదో ఒక పని చేసుకుంటూ బతికేవాడు. చివరికి బెంగళూరులో స్థిరపడి కష్టపడి పనిచేశాడు. అక్కడే పెళ్లి చేసుకుని కుటుంబంతో ఉంటున్నాడు. కానీ.. తల్లిదండ్రులు, తోబుట్టువుల జ్ఞాపకాలను రాముడిని వెంటాడగా.. చిన్ననాడు చేసిన పొరపాటుతో ఇంటికి వెళ్లే ధైర్యం చేయలేదు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియతో

ఇదిలా ఉండగా.. సినిమాల్లో మాదిరిగానే వీరి కథకు ఓ సంతోషకరమైన ముగింపు లభించింది. అదీ సర్‌(ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ). కర్ణాటకలో సర్‌ ప్రక్రియ జరిగే సమయంలో రాముడు ఎన్నికల సంఘం SIR దరఖాస్తు పత్రాన్ని నింపాల్సి వచ్చింది. అందులో తల్లిదండ్రుల పూర్తి పేర్లు, వారి అసలు చిరునామా రాయాల్సి ఉండగా.. నమోదు చేస్తున్నప్పుడు అతని గుండె భావోద్వేగానికి లోనైంది. దీంతో ఎలాగైనా తన తల్లిదండ్రులను తిరిగి చేరుకోవాలని నిశ్చయించుకున్నాడు.

ఎమ్మిగనూరులో ఆనందభాష్పాలు

ముప్పై ఏళ్ల విరామం తర్వాత రాముడు ఎమ్మిగనూరుకి తిరిగి చేరుకున్నారు. ఇంటికి చేరుకుని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడగానే అతని మనసు ద్రవించింది. తమ కుమారుడు ఏమయ్యాడో తెలియని స్థితిలో ఉన్న కుమారుడిని చూడగానే కుటుంబీకులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. మొత్తానికి సర్‌ ప్రక్రియ.. మూడు దశాబ్దాల తర్వాత వారిని ఒక్కటి చేసింది.

Story first published: Thursday, July 23, 2026, 20:05 [IST]
Desktop Bottom Promotion