Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
పెళ్లి కాదు,ఆధ్యాత్మిక వేడుకనే..భారతీయ సంప్రదాయాల పునరవైభవంగా నిలిచిన అనంత్-రాధిక వివాహం
గత ఏడాది జూలైలో భారతదేశం కేవలం ఒక అంగరంగ వైభవమైన పెళ్లిని కాదు, ఒక సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని కళ్లారా చూసింది. పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్, శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్ ను పరిణయమాడిన వేళ ఆ వేడుక సనాతన ధర్మానికి, తరతరాల భారతీయ సంప్రదాయాలకు, శాశ్వతమైన విలువలకు అద్భుతమైన నివాళిగా నిలిచింది.
అనంత్-రాధిక జంట వివాహం ఆధునిక భారతదేశంలో ఒక చారిత్రాత్మక వేడుకగా, ఒక మైలురాయిగా నిలిచిపోయింది. వేద మంత్రాల సాక్షిగా, పవిత్ర ఆచారాల మధ్య అపురూపమైన సంప్రదాయబద్ధంగా వారి పెళ్లి కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది.

పవిత్ర క్షేత్రాలను తలపించిన వివాహ వేదికలు
అంబానీ కుటుంబం స్వస్థలం గుజరాత్ లోని జామ్ నగర్ నుండి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వరకు ఈ వివాహ వేడుకలు అంబరాన్నంటాయి. ఆ వేదికలను కేవలం విలాసవంతంగా కాకుండా భారతీయ సాంస్కృతిక సంపదను ప్రతిబింబించేలా, ఆధ్యాత్మిక శక్తితో నిండిన పవిత్ర ప్రాంగణాలుగా తీర్చిదిద్దారు.
ఒక ఇంటర్వ్యూలో నీతా అంబానీ మాట్లాడుతూ..ఈ పెళ్లి మా కుటుంబం కోసం మాత్రమే కాదు. ఇది మొత్తం భారతదేశం కోసం. ఇక్కడ అలంకరించిన ప్రతి పువ్వు, పఠించిన ప్రతి మంత్రం, ఏర్పాటు చేసిన ప్రతి అంశం సనాతన ధర్మ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. మా పిల్లల వైవాహిక జీవితానికి ఇంతకంటే పవిత్రమైన ప్రారంభం ఉండదని మేము భావించాం అని అన్నారు.
పురాతన విజ్ఞానాన్ని ప్రతిబింబించిన ఆచారాలు
వారణాసి, తిరుపతికి చెందిన ప్రఖ్యాత పండితుల ఆధ్వర్యంలో ఈ వివాహాన్ని పూర్తిగా వేద సంప్రదాయాలు, ధార్మిక ఆచారాల ప్రకారం నిర్వహించారు. గణేశ పూజ, గ్రహ శాంతి నుండి వేద వివాహ సంస్కారం వరకు ప్రతి ఘట్టం ఆధ్యాత్మిక లోతులతో, అర్థవంతంగా సాగింది.
కన్యాదానం సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన ముఖేష్ అంబానీ..నా కోడలు ఇప్పుడు మా ఇంటి దీపం. మేము పెరిగిన ప్రతి పవిత్రమైన విలువను ఈ పెళ్లిలో నిలబెట్టినందుకు గర్వంగా ఉంది అని అన్నారు.
జయమాల సమయంలో రాధిక..సంస్కృత శ్లోకాలతో అలంకరించిన లెహంగాలో మండపంలోకి అడుగుపెట్టడం అత్యంత హృద్యమైన క్షణాలలో ఒకటి. ఆ సమయంలో అనంత్, సంప్రదాయ ధోతీ-కుర్తాలో వినమ్రంగా చేతులు జోడించి నిలబడటం అందరినీ ఆకట్టుకుంది.
బాలీవుడ్ ను దాటి ప్రపంచాన్ని తాకిన వేడుక
ఈ పెళ్లికి హాజరైన అతిథుల జాబితా ఒక తారాలోకాన్ని తలపించింది. షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణె నుండి అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ వరకు, ఇవాంకా ట్రంప్, బిల్ గేట్స్ వంటి అంతర్జాతీయ ప్రముఖుల వరకు అందరూ ఈ వేడుకకు సాక్షులుగా నిలిచారు.
వివాహం అనంతరం అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ లో..నా జీవితంలో మన దేశపు మట్టితో, మన ఆత్మతో ఇంతగా ముడిపడిన పెళ్లిని ఎప్పుడూ చూడలేదు. ఇది కేవలం ఆడంబరం కాదు.. ఇది ధర్మం, సంప్రదాయం, మన మూలాల గొప్పతనాన్ని చాటిచెప్పిన ఉత్సవం అని తెలిపారు.
అంబానీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన షారుఖ్ ఖాన్.. అనంత్ నాకు తమ్ముడి లాంటివాడు. అతను రాధికతో కలిసి ఇంతటి సంప్రదాయబద్ధంగా, ప్రేమగా తన ప్రయాణాన్ని ప్రారంభించడం చూడటం చాలా ఆనందాన్నిచ్చింది. ఇది అసలైన భారతదేశపు గొప్పతనాన్ని కళ్లకు కట్టింది అని చెప్పారు.

వస్త్రధారణలో ఉట్టిపడిన వారసత్వపు సొబగులు
రాధిక ధరించిన లెహంగాను ప్రఖ్యాత డిజైనర్లు అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. దానిపై శంఖం, కలశం, కమలం వంటి పవిత్ర చిహ్నాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. మరోవైపు అనంత్, ప్రాచీన శైలి ఎంబ్రాయిడరీతో చేనేత పట్టు వస్త్రాలలో మెరిసిపోయారు.
డిజైనర్ సందీప్ ఖోస్లా మాట్లాడుతూ..మేము ఒక లెహంగాను కాదు, ఒక వారసత్వాన్ని సృష్టించాం. రాధిక..5,000 సంవత్సరాల సంప్రదాయాన్ని తన భుజాలపై ఆధునిక హుందాతనంతో మోసింది అని అన్నారు.
భక్తితో మేళవించిన నిర్మాణ వైభవం
ఈ వివాహ వేడుకల కోసం అయోధ్య రామ జన్మభూమి, మదురై మీనాక్షి అమ్మవారి ఆలయాలను పోలిన మండపాలను సృష్టించారు. కుంభమేళా, ఆలయ ఉత్సవాలకు పనిచేసిన వారే ఈ నిర్మాణ కౌశలాన్ని ప్రదర్శించడం విశేషం. ప్రతి వేడుకలో కర్ణాటక, హిందుస్థానీ, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించి, దేశంలోని వివిధ రాష్ట్రాల సాంస్కృతిక సమ్మేళనాన్ని ఆవిష్కరించారు.

నిలిచిపోయే వారసత్వం
ఈ వివాహం ద్వారా కేవలం అనంత్-రాధికల ప్రేమకథ మాత్రమే కాదు, అది సృష్టించిన సాంస్కృతిక ప్రభంజనం కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. నేడు ఎన్నో భారతీయ కుటుంబాలు తమ వివాహ వేడుకలను కేవలం ఆడంబరం కోసం కాకుండా, ఆత్మతో కూడిన అనుబంధం కోసం ధార్మిక మార్గంలో జరుపుకోవడానికి స్ఫూర్తి పొందుతున్నాయి. వేద మంత్రాల నుండి బాలీవుడ్ ఆశీస్సుల వరకు తరతరాల విలువల నుండి అంతర్జాతీయ ప్రశంసల వరకు అనంత్-రాధికల వివాహం ఆధునిక భారతీయ సంస్కృతిలో ఒక చారిత్రక ఘట్టం. ఇది అర్థవంతమైన వేడుకలకు కొత్త తరాన్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది.



Click it and Unblock the Notifications











