Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
రైలు టిక్కెట్లు ఈజీగా ఆన్ లైన్ లో బుక్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకుంటే మీకే నష్టం!
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్లో భారతీయ రైల్వే ముందు వరుసలో ఉంటుంది. మనదేశంలో నిత్యం కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లల్లో ప్రయాణాలు చేస్తుంటారు. సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ లో రైలు ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుంది. సరుకు రవాణాతో పాటు ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంలో భారతీయ రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ రైల్వే ప్యాలెస్ ఆన్ వీల్స్, మహారాజా ఎక్స్ ప్రెస్ వంటి లగ్జరీ రైళ్లను కూడా అందుబాటులోకి తెచ్చాయి.
మన దేశంలో 170 ఏళ్ల క్రితమే మొదటి రైలు అందుబాటులోకి వచ్చింది. 1853 ఏప్రిల్ 16న బోరి బందర్ నుంచి థానే మధ్య మొదటి ప్యాసింజర్ రైలు నడిచింది. 34 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ కవర్ చేసేది. దీని జ్ఞాపకార్థంగా ఏటా ఏప్రిల్ 16న భారతీయ రైలు రవాణా దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు.

గతంలో సీటు పొందడానికి ప్రయాణికులు టికెట్ కౌంటర్ల దగ్గర పొడవైన క్యూలలో నిలబడాల్సి వచ్చేది. కానీ భారతదేశం డిజిటల్ ఇండియాగా మారడం ప్రారంభించిన తర్వాత ఆన్ లైన్ టికెట్ బుకింగ్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం టికెట్ కౌంటర్లలో ట్రైన్ టిక్కెట్లు కొనుగోలు చేసే వారి కంటే ఆన్లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకునే వారి సంఖ్య చాలా రెట్లు పెరిగింది. భారతదేశంలోని అన్ని రైలు టిక్కెట్లలో 80శాతం IRCTC ద్వారా ఆన్లైన్ లో బుక్ చేయబడుతున్నాయి. అయితే చాలా ప్రయాణికుల ఆందోళన ఏమిటంటే..ఆన్ లైన్ టిక్కెట్ల ధర కౌంటర్ టిక్కెట్ల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది.
మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో రైలు టికెట్ బుక్ చేసుకుని ఉంటే..అది కౌంటర్ టికెట్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ రేటు ఉండటం మీరు గమనించి ఉంటారు. ఎందుకంటే ఆన్లైన్ రైలు టిక్కెట్లను IRCTC వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవచ్చు. మీరు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఇతర యాప్ లను ఉపయోగించినా కూడా మీకు IRCTCలో అకౌంట్ ఉండాలి. అది లేకుండా ఆన్ లైన్ లో రిజర్వేషన్ చేసుకోవడం సాధ్యపడదు.
ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు IRCTC ప్రయాణీకుల నుండి GST తో పాటు సౌకర్య రుసుమును వసూలు చేస్తుంది. ఇది నేరుగా IRCTC కి వెళుతుంది, GST ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ అదనపు రుసుములు ఆన్ లైన్ టిక్కెట్లను కౌంటర్ టిక్కెట్ల కంటే ఖరీదైనవిగా చేస్తాయి.
రైల్వే మంత్రి దీనిపై ఏం చెప్పారు?
ఇటీవల ఒక లోక్సభ సభ్యుడు పార్లమెంట్ లో కౌంటర్ టిక్కెట్ల కంటే ఆన్లైన్ టిక్కెట్లు ఎందుకు ఖరీదైనవని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ..ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను నిర్వహించడం, మెరుగుపరచడం, విస్తరించడం కోసం IRCTC గణనీయమైన ఖర్చులను భరిస్తుందని వివరించారు. ఈ ఖర్చులను తిరిగి పొందడానికి,ఐఆర్సిటిసి ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లకు సౌకర్య రుసుమును వసూలు చేస్తుందని ఆయన తెలిపారు. ఆన్లైన్ టిక్కెట్లు ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో పొడవైన క్యూలలో వేచి ఉండకుండా ఉండటానికి సహాయపడతాయని, ఇది సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుందని, టికెట్ కౌంటర్లకు వెళ్లి తిరిగి వచ్చే ప్రయాణ ఖర్చులను కూడా తగ్గిస్తుందని ఆయన అన్నారు.



Click it and Unblock the Notifications