Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
బంగారం ధర చూస్తే..ధనవంతులకు కూడా కళ్లు తిరిగిపోతున్నాయి,రూ.4400 పెరిగిన గోల్డ్
బంగారం ధరలు చూస్తుంటే ఏం కొనేటట్లుగా కనబడట్లేదు. రోజు రోజుకి ధర అమాంతం పెరిగిపోతుందే తప్ప కిందకి దిగడం లేదు. ధనవంతులకు కూడా కొనాలంటే కష్టంగా మారిపోయింది. ఇప్పటికే స్పాట్ మార్కెట్ లో కూడా నిపుణుల అంచనాలకు మంచి రేటు పెరిగిపోతుంది. ఇది చూస్తుంటే 2025లో సామాన్యులు బంగారం కొనడం కలగానే మిగిలిపోయే పరిస్థితి కనబడుతుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు తప్ప మిగిలిన వాళ్లు తమ కొనుగోలు ప్రణాళికలను పెరుగుతున్న ధరలతో వాయిదా వేసుకుంటున్నారు.
అయితే ఈ ధరల పెంపు ఇంకెన్ని నెలలు కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బంగారం ధర ఈ సంవత్సరంలోనే రూ.1 లక్ష దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోపక్క వెండి ధరలు కూడా బంగారం దాటి పరుగులు పెడుతుంది. గత వారం స్వల్పంగా వెండి ధరలు తగ్గినప్పటికీ మళ్లీ భారీగా ర్యాలీ కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లలో ఒడిదుకులే బంగారం,వెండి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చిత్ర విచిత్ర నిర్ణయాల కారణంగా అమెరిక ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు నడుస్తుందా అనే ఆందోళనలో పెట్టుబడిదారులందరూ తమ డబ్బులను బంగారం వంటి విలువైన మెటల్స్ వైపు తరలిస్తున్నారు. దీనికి సాక్ష్యం ఇటీవల అమెరికా మార్కెట్లు భారీగా పతనం కావడమే. ఎక్కువ మంది పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ గా భావించే బంగారంలోకి తమ డబ్బును తరలిస్తుండటంతో డిమాండ్ పెరిగిపోయి బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా మండిపోతున్నాయి. వాస్తవానికి ఇది భారతీయ వినియోగదారులు కోరుకునే పరిస్థితి కాదు.
హైదరాబాద్,విజయవాడలో ఇవాళ(మార్చి 19) బంగారం ధరల వివరాలు
హైదరాబాద్ లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి పోల్చితే 100 గ్రాములకు రూ.4000 పెరిగింది. దీంతో ఈరోజు 22 క్యారెట్ల తులం(10 గ్రాములు) బంగారం ధర రూ. 82900 గా ఉంది. నిన్నటి పోల్చితే తులం మీద రూ.400 పెరిగింది.
ఇవాళ హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,440గా ఉంది. అంటే నిన్నటితో పోల్చితే 44 రూపాయలు తగ్గింది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ. రూ. 82900 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,440గా ఉంది.
వెండి ధరలు
విజయవాడలో ఇవాళ 1 కేజీ వెండి ధర రూ.1,14,000గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.1000 పెరిగింది.
హైదరాబాద్ ఇవాళ 1 కేజీ వెండి ధర రూ.రూ.1,14,000గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.1000 పెరిగింది.
వ్యాపారుల ఆందోళన
అంతర్జాతీయ రాజకీయ పరిణాలతో వివిధ దేశాలలో కొనసాగేతేన్న అనిశ్చితి, పలు చోట్ల యుద్ధ వాతావరణం ఇవన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అధిక ధరల ప్రభావంతో సమాన్యులు బంగారపు షాపుల వైపుకి చూడకపోవడం వ్యాపారులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. రేట్లు పెరిగియాని సంతోషం ఉన్నప్పటికీ వాటిని కొనేవాళ్లు భారీగా తగ్గుముఖం పట్టడంతో షాపుల నిర్వహణ కూడా కష్టంగా మారుతోందంటూ చాలామంది వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications