Latest Updates
-
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే
పెళ్లిళ్ల సీజన్ వేళ సామాన్యులకు భారీ శుభవార్త..దిగొచ్చిన బంగారం,వెండి ధరలు!
సామాన్య ప్రజలకు శుభవార్త. కొద్దిరోజులుగా మనదేశంలో బంగారం ధరలు భారీగా పెరుగతుూ పోతున్న విషయం తెలిసిందే. బంగారం ధరల పెరుగుదలకు వివిధ కారణాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచదేశాలపై విరుచుకుపడుతున్న వేళ పెట్టుబడిదారులు తమ డబ్బును స్టాక్ మార్కెట్ నుంచి బంగారం వైపుకి అంటే స్పాట్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు. దీనికితోడు అంతర్జాతీయ రాజకీయ పరిణాలతో వివిధ దేశాలలో కొనసాగేతేన్న అనిశ్చితి, పలు చోట్ల యుద్ధ వాతావరణం ఇవన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
అధిక ధరల ప్రభావంతో సమాన్యులు బంగారపు షాపుల వైపుకి చూడకపోవడం వ్యాపారులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. రేట్లు పెరిగియాని సంతోషం ఉన్నప్పటికీ వాటిని కొనేవాళ్లు భారీగా తగ్గుముఖం పట్టడంతో షాపుల నిర్వహణ కూడా కష్టంగా మారుతోందంటూ చాలామంది వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో నేడు బంగారం ధరలు కొంచెం తగ్గుముఖం పట్టడం అందరికీ ఉపశమనం కలిగించింది. కొద్ది నెలలుగా ఊహించని విధంగా పైకి ఎగబాతుతున్న బంగారం ధరలు ఇవాళ(మార్చి 17,2025) కిందకి దిగాయి.

ఈ రోజు బంగారం ధరల వివరాలు ఇవాళ
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 24 క్యారెట్ల తులం బంగారం(10 గ్రాములు) ధర రూ. 89,710 ఉండగా..22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82,250గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఇవాళ 24 క్యారెట్ల తులం బంగారం(10 గ్రాములు) ధర రూ.89,560 ఉండగా..22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,100గా ఉంది.
హైదరాబాద్ ఇవాళ 24 క్యారెట్ల తులం బంగారం(10 గ్రాములు) ధర రూ. 89560 ఉండగా....22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82100 గా ఉంది.
ఏపీలోని విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం(10 గ్రాములు) ధర రూ. 89560 ఉండగా..22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82100 గా ఉంది.
వెండి ధరలు ఇవాళ ఇలా ఉన్నాయి
-కొంతకాలంగా రాకెట్ మాదిరి దూసుకుపోతున్న వెండి ధరలు ఇవాళ కిందకి దిగాయి. ఇవాళ కేజీకి రూ.100 వరకు వెండి ధర తగ్గింది. హైదరాబాద్ లో ఇవాళ వెండి ధర 1 కేజీ రూ. 1,11,900 ఉండగా..విజయవాడలో ఈరోజు 1కేజీ వెండి ధర రూ. 1,11,900గా ఉంది. ఆదివారం(మార్చి 16)తో పోల్చితే వెండి కేజీకి రూ.100 తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీ 1 కేజీ వెండి ధర ఇవాళ రూ. 1,02900 ఉండగా..దేశ వాణిజ్య రాజధానిలో ఇవాళ 1 కేజీ వెండి ధర రూ. 1,02900గా ఉంది.
మరింత పైకి
అయితే 2025లో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోలార్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వాలను సబ్సీడీల పేరుతో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి వినియోగం పెరుగుతన్న వేళ దీని ధరలు కూడా ఆకాశాన్ని తాకుతూ వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది చివరినాటికి వెండి ధరలు మరింత భారీగా పెరిగే అవకాశముందని నిపుణలు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications











