Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
హెచ్5ఎన్1 వైరస్.. కరోనా కన్నా యమ డేంజర్..
కరోనాకన్నా భయానకమైన పరిస్థితి రాబోతోందని వైద్యనిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి కన్నా 100 రెట్లు హోరంగా ఉండబోతోందంటూ కోవిడ్ ప్యాండమిక్ రిపోర్టులు చెబుతున్నాయ్.

ఇటీవల హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ సోకి కొంతమంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇప్పుడదే వైరస్ మరింత ప్రమాదకరంగామారి కరోనాకు మించిపోనుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. పిట్స్బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు డాక్టర్ సురేష్ కూచిపూడి మాట్లాడుతూ.. "ఒక్కసారి గనక ఈ వైరస్ వ్యాప్తి చెందితే మనము అత్యంత ప్రమాదస్థితిలో ఉన్నట్టేనని సామాన్యులు అభిప్రయాపడుతున్నారు.ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఈ వైరస్ వల్ల చాలా జంతువుల ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని ఎప్పటికైనా ఇది పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదమన్నారు.
మరణాల రేటు
ప్రపంచ ఆరోగ్యం సంస్థ అధికారిక లెక్కల ప్రకారం 2003 నుంచి ఇప్పటి వరకు 100 మందికి హెచ్5ఎన్1 వైరస్ సోకితే అందులో 52 మంది మృతి చెందారు. తొలిసారిగా ఈ వైరస్ను 1996లో చైనాలో గుర్తించారు. ఆ సమయంలో హాంకాంగ్లో 18 మందికి వైరస్ సోకితే అందులో ఆరుగురు మరణించారు. అంటే మరణం రేటు 50 శాతం కన్నా ఎక్కువే ఉందని తెలుస్తోంది. కరోనా మరణం రేటు కన్నా ఈ ప్రాణాంతక బర్డ్ఫ్లూ రేటు చాలా ఎక్కువగా ఉంది.
హెచ్5ఎన్1 వైరస్ అంటే ఏంటి
హెచ్5ఎన్1 వైరస్కు బర్డ్ఫ్లూ లేదంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే పేరు కూడా ఉంది. ఇది ముందుగా పక్షులకు సోకి వాటి నుంచి జంతువులకు, మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ ప్రధమంగా కోళ్ల ఫారమ్ నుంచి వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ కోళ్లు, పక్షులతో నేరుగా కాంటాక్ట్ అయితే సులభంగా ఈ వైరస్ సోకుతుంది. ఈ వ్యాధి సోకినవారికి జ్వరం, దగ్గు, గొంతు బొంగురపోవడం, నుమోనియా లక్షణాలతో పాటు ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది.
డైరీఫామ్లో వ్యాప్తి
అమెరికాలోని టెక్సాస్లో ఓ వ్యక్తికి డైరీ ఫామ్ నుంచి హెచ్5ఎన్1 వైరస్ సోకింది. విషయం తెలియగానే యురోపియన్ యూనియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ ఆ వైరస్ వ్యప్తి చెందే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసి మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. విచారణ చేస్తే కాన్సాస్, న్యూమెక్సికో మిషిగన్, టెక్సాస్, ఓహియో, ఇడాహోలోని పాడి పశువులకు బర్డ్ఫ్లూ సోకినట్టు గుర్తించారు. ఇక్కడి ఆవులకు కూడా పక్షల ద్వారానే వైరస్ సోకినట్లు విచారణలో తేలింది.



Click it and Unblock the Notifications