Latest Updates
-
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
ఐ లవ్ యూ అమ్మా,తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో.. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య వెనుక గుండెల్ని పిండేసే విషాదం!
హైదరాబాద్ నగరంలో మరో యువతి ప్రేమకు బలయ్యింది. కళ్లనిండా ఎన్నో అందమైన కలలు, సినీ రంగంలో అడుగుపెట్టి హీరోయిన్ గా ఎదగాలనే ఆశయం.. కానీ ప్రేమించిన వాడి చేతిలో మోసపోయి ఉరికొయ్యకు వేలాడింది. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అమ్మా.. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అంటూ కువైట్ లో ఉన్న కన్నతల్లికి పంపిన కడపటి సందేశం అందరి హృదయాలను కలచివేస్తోంది.
అసలేం జరిగిందంటే..
విశాఖపట్నానికి చెందిన బోను కోమలి (21) హైదరాబాద్ లోని మణికొండ చిత్రపురి కాలనీలో బంధువుల దగ్గర ఉంటూ బీఎస్సీ చదువుతోంది. చదువుకుంటూనే సోషల్ మీడియాలో యూట్యూబర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అదే విశాఖపట్నానికి చెందిన అఖిల్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో కోమలి రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమ పేరుతో దగ్గరైన అతడు ఆమెను మానసికంగా, ఆర్థికంగా వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

తీరా పెళ్లి చేసుకుందాం అనేసరికి అఖిల్ ముఖం చాటేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తనను దూరం పెడుతుండటంతో మనస్తాపానికి గురైన కోమలి ఆరు నెలల క్రితం కూడా ఆత్మహత్యకు యత్నించగా బంధువులు, తల్లి సర్దిచెప్పారు. అతడిని వదిలేసి, కెరీర్ పై దృష్టి పెడతానని, హీరోయిన్ అవుతానని అప్పట్లో కోమలి తన తల్లికి మాటిచ్చింది.
చివరి రోజుల్లోం జరిగిందంటే..
పోలీసుల దర్యాప్తు, సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. శనివారం రాత్రి అఖిల్ రెడ్డి కోమలి ఉంటున్న గదికి వచ్చినట్లు సమాచారం. ఆ సమయంలో పెళ్లి విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక క్షోభకు గురైన కోమలి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుంది. మధ్యాహ్నాం 3 గంటల సమయంలో పదే పదే తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో రాయదుర్గం ఇన్ స్పెక్టర్ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు గొళ్లెం పగలగొట్టి చూడగా ఆమె విగతజీవిగా కనిపించింది.
కన్నీరుమున్నీరుగా తల్లి ఆవేదన..
కూతురి మరణవార్త తెలుసుకుని కువైట్ నుంచి హుటాహుటిన నగరానికి చేరుకున్న తల్లి సత్య వరలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు.
అందంగా ఉండే నా కూతుర్ని ఇలా విగతజీవిగా చూడలేకపోతున్నా. పెళ్లి పీటలు ఎక్కాల్సిన నా బిడ్డను అఖిల్ రెడ్డి పాడెక్కించాడు. ప్రేమ పేరుతో నా బిడ్డను వాడుకున్నాడు, ఆమె డబ్బులు కూడా కాజేశాడు. డబ్బు పోయినా పర్వాలేదు, కానీ వాడి కారణంగా నా కూతురే దక్కకుండా పోయింది. పైగా అఖిల్ వాళ్ల అక్క ఫోన్ చేసి, తన తమ్ముడు ఎక్కడ చనిపోతాడో అంటూ మమ్మల్నే బెదిరించింది. నా బిడ్డ చావుకు కారణమైన వాడిని కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలి అంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
కోమలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో కోమలి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఈ కథనం ఇవ్వబడింది. దీనిని బోల్డ్ స్కై తెలుగు ధృవీకరించలేదు.



Click it and Unblock the Notifications