Latest Updates
-
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
ప్రముఖ పంజాబీ రచయిత అమృతకు గూగుల్ డూడుల్ నివాళి..
అమృత 16 ఏళ్ల వయస్సులోనే "డేర్డ్ టు లైవ్ ద లైఫ్ ఆఫ్ షి ఇమాజిన్స్"ను రచించింది. 1947లో భారత్-పాక్ విభజన నేపథ్యంలో "అజ్డ్ అఖాన్ వారిస్ షా ను" అనే ఆమె కవితకు విశేషమైన ఆదరణ లభించింది.
భారతదేశంలోనే అత్యంత ప్రముఖ పంజాబీ రచయిత అమృత ప్రీతమ్ శత జయంతి సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించి ఆమెకు ఘనంగా నివాళి అర్పించింది. ఆమె బ్రిటీష్ ఇండియా పంజాబ్ బోలని గుజ్రాన్ వాలా ప్రాంతంలో జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్థాన్ దేశంలో ఉంది.

ఆమె ఆత్మకథ 'కాలా గులాబ్'ని మరిపించేలా గూగుల్ డూడుల్ ని తీర్చిదిద్దింది. కాలా గులాబ్ తో ఆమె జీవితంలోని పలు చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. వీటి స్ఫూర్తితో మహిళలు తమ సమస్యలపై గళమెత్తడం ప్రారంభించారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలలో మహిళలు నిర్భయంగా మాట్లాడటానికి అమృత ప్రీతమ్ జీవిత చరిత్ర స్ఫూర్తినిచ్చిందని సాహితీవేత్తలు చెబుతుంటారు.
సాహిత్య అకాడమీ (1956) అందుకున్న తొలి మహిళగా అమృత ఖ్యాతిని గడించారు. దీనితో పాటు జ్ఞానపీఠ్ అవార్డు (1981), పద్మవిభూషణ్ అవార్డులు కూడా ఆమెకు దక్కాయి. ఆమె రచించిన ప్రముఖ నవల 'పింజర్'ను బాలీవుడ్ లో సినిమాగా తెరకెక్కించారు. దీనికి దేశ సమైక్యతా విభాగంలో ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు కూడా వచ్చింది. దేశ విభజన నేపథ్యంలో వచ్చిన నవలగా దీనికి ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.
అమృత 16 ఏళ్ల వయస్సులోనే "డేర్డ్ టు లైవ్ ద లైఫ్ ఆఫ్ షి ఇమాజిన్స్"ను రచించింది. 1947లో భారత్-పాక్ విభజన నేపథ్యంలో "అజ్డ్ అఖాన్ వారిస్ షా ను" అనే ఆమె కవితకు విశేషమైన ఆదరణ లభించింది. 20వ శతాబ్దంలో గొప్ప పంజాబీ కవిగా పేరు సంపాదించిన ప్రీతమ్ విభజన సమయంలో 'పింజర్' తో సహా 28 నవలలను ప్రచురించింది. దీన్ని కూడా ఒక చలనచిత్రంగా రూపొందించారు.
ఆరు దశాబ్దాలుగా అమృత ప్రీతమ్ దాదాపు 100 రచనలను చేశారు. 2005లో ఆమె నవల 'ది అస్తి పంజరం' యొక్క అనువాదానికి లా రూట్ డెస్ ఇండెస్ బహుమతి కూడా లభించింది. ఆమెకు భారతదేశంతో పాటు పాకిస్థాన్ దేశంలోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. దేశ విభజన తర్వాత అమృత పాకిస్థాన్ లో నివసించారు. ఆమె పంజాబీ భాషలో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ, అమృత ప్రీతం హిందీ, ఉర్దూ భాషాలలో కూడా చాలా రచనలు చేశారు. అలాగే ఆల్ ఇండియా రేడియోలో కూడా అమృత పనిచేశారు. 1986లో ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అక్టోబర్ 31, 2005లో ఆమె అనారోగ్యంతో శాశ్వతంగా కన్నుమూశారు.



Click it and Unblock the Notifications












