Latest Updates
-
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.! -
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ.. -
గుడ్లు,చికెన్ కంటే వీటిలోనే ఎక్కువ ప్రొటీన్,మినరల్స్..బరువు తగ్గాలన్నా,కండలు పెంచాలన్నా ఇవే బెస్ట్ -
ఇడ్లీ, దోసెలు కాదు పొద్దున్నే ఇది తినండి..100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు!
ప్రముఖ పంజాబీ రచయిత అమృతకు గూగుల్ డూడుల్ నివాళి..
అమృత 16 ఏళ్ల వయస్సులోనే "డేర్డ్ టు లైవ్ ద లైఫ్ ఆఫ్ షి ఇమాజిన్స్"ను రచించింది. 1947లో భారత్-పాక్ విభజన నేపథ్యంలో "అజ్డ్ అఖాన్ వారిస్ షా ను" అనే ఆమె కవితకు విశేషమైన ఆదరణ లభించింది.
భారతదేశంలోనే అత్యంత ప్రముఖ పంజాబీ రచయిత అమృత ప్రీతమ్ శత జయంతి సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించి ఆమెకు ఘనంగా నివాళి అర్పించింది. ఆమె బ్రిటీష్ ఇండియా పంజాబ్ బోలని గుజ్రాన్ వాలా ప్రాంతంలో జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్థాన్ దేశంలో ఉంది.

ఆమె ఆత్మకథ 'కాలా గులాబ్'ని మరిపించేలా గూగుల్ డూడుల్ ని తీర్చిదిద్దింది. కాలా గులాబ్ తో ఆమె జీవితంలోని పలు చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. వీటి స్ఫూర్తితో మహిళలు తమ సమస్యలపై గళమెత్తడం ప్రారంభించారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలలో మహిళలు నిర్భయంగా మాట్లాడటానికి అమృత ప్రీతమ్ జీవిత చరిత్ర స్ఫూర్తినిచ్చిందని సాహితీవేత్తలు చెబుతుంటారు.
సాహిత్య అకాడమీ (1956) అందుకున్న తొలి మహిళగా అమృత ఖ్యాతిని గడించారు. దీనితో పాటు జ్ఞానపీఠ్ అవార్డు (1981), పద్మవిభూషణ్ అవార్డులు కూడా ఆమెకు దక్కాయి. ఆమె రచించిన ప్రముఖ నవల 'పింజర్'ను బాలీవుడ్ లో సినిమాగా తెరకెక్కించారు. దీనికి దేశ సమైక్యతా విభాగంలో ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు కూడా వచ్చింది. దేశ విభజన నేపథ్యంలో వచ్చిన నవలగా దీనికి ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.
అమృత 16 ఏళ్ల వయస్సులోనే "డేర్డ్ టు లైవ్ ద లైఫ్ ఆఫ్ షి ఇమాజిన్స్"ను రచించింది. 1947లో భారత్-పాక్ విభజన నేపథ్యంలో "అజ్డ్ అఖాన్ వారిస్ షా ను" అనే ఆమె కవితకు విశేషమైన ఆదరణ లభించింది. 20వ శతాబ్దంలో గొప్ప పంజాబీ కవిగా పేరు సంపాదించిన ప్రీతమ్ విభజన సమయంలో 'పింజర్' తో సహా 28 నవలలను ప్రచురించింది. దీన్ని కూడా ఒక చలనచిత్రంగా రూపొందించారు.
ఆరు దశాబ్దాలుగా అమృత ప్రీతమ్ దాదాపు 100 రచనలను చేశారు. 2005లో ఆమె నవల 'ది అస్తి పంజరం' యొక్క అనువాదానికి లా రూట్ డెస్ ఇండెస్ బహుమతి కూడా లభించింది. ఆమెకు భారతదేశంతో పాటు పాకిస్థాన్ దేశంలోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. దేశ విభజన తర్వాత అమృత పాకిస్థాన్ లో నివసించారు. ఆమె పంజాబీ భాషలో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ, అమృత ప్రీతం హిందీ, ఉర్దూ భాషాలలో కూడా చాలా రచనలు చేశారు. అలాగే ఆల్ ఇండియా రేడియోలో కూడా అమృత పనిచేశారు. 1986లో ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అక్టోబర్ 31, 2005లో ఆమె అనారోగ్యంతో శాశ్వతంగా కన్నుమూశారు.



Click it and Unblock the Notifications
