Latest Updates
-
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే! -
ఎండ దెబ్బకు చెక్: బార్లీ నీళ్లా? చెరకు రసమా? వేసవి వ్యర్థాలను తరిమికొట్టే బెస్ట్ డ్రింక్ ఏది? -
ఇప్పటి ప్రేమ పరిచయాలు యువతను ఎందుకు మానసికంగా అలసిపోయేలా చేస్తోంది -
మధురై తణ్ణి చట్నీతో ఇడ్లీ, దోశల టేస్ట్ డబుల్!..ఎలా చేసుకోవాలంటే.. -
బాధ్యతలు ఏవైనా ఒత్తిడి సమానమే.. మహిళలూ వీటిపై నిర్లక్ష్యం వద్దు.!
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
మనదేశంలో క్రికెట్ అనేది కేవలం ఒక ఆట కాదు, కోట్లాది మంది ఎమోషన్. మైదానంలో ఆటగాళ్లు బౌండరీలు కొడుతుంటే ప్రేక్షకుల నరాలు ఉప్పొంగుతాయి. విజయం సాధించినప్పుడు సంబరాలు అంబరాన్ని అంటుతాయి, ఓడిపోతే కన్నీరు మున్నీరవుతారు. అయితే, ఈ ఆటకు అహంకారం, రాజకీయాలు తోడైతే ఎంతటి దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయో నిరూపించే ఒక విస్తుపోయే సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

మహారాష్ట్ర రాష్ట్రంలోని జల్గావ్ జిల్లాలోని ధారంగావ్ అనే ప్రాంతంలో ఇటీవల ఎమ్మెల్యే ట్రోఫీ పేరుతో ఒక భారీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఏప్రిల్ 12న ఫైనల్ మ్యాచ్ కావడంతో ధారంగావ్, దాని చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది అభిమానులు, క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా మైదానానికి చేరుకున్నారు. ఫైనల్ పోరులో గెలిచి కప్పు ఎవరు సొంతం చేసుకుంటారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైదానం అంతా సందడిగా మారింది. కానీ, ఆ ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు.
అందరూ మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్న సమయంలో ఊహించని విధంగా మైదానంలోకి ఒక ట్రాక్టర్ దూసుకొచ్చింది. ఆ ట్రాక్టర్ నడుపుతున్నది ఎవరో కాదు... ఆ ప్రాంత మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు. ఫైనల్ మ్యాచ్ లాంటి పెద్ద కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించలేదన్న కోపంతో ఏకంగా ఆ ట్రాక్టర్ ను నేరుగా క్రికెట్ పిచ్ పైకి పోనిచ్చాడు. అందరూ చూస్తుండగానే, ఆ ట్రాక్టర్ తో పిచ్ను దారుణంగా దున్నేశాడు. ఈ పరిణామానికి ఆటగాళ్లు, నిర్వాహకులు, ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక అందరూ స్థాణువైపోయారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహానికి లోనై, తనను ఆహ్వానించలేదన్న ఒకే ఒక్క కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టారు అని స్థానిక అధికారులు నిర్ధారించారు. పిచ్ పూర్తిగా ధ్వంసం కావడంతో, ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఫైనల్ మ్యాచ్ ను వెంటనే రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఎంతో కష్టపడి ఫైనల్ కు చేరుకున్న జట్ల ఆటగాళ్లు తీవ్ర నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది.
మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఇంత పెద్ద దుమారం రేగినప్పటికీ, సదరు నాయకుడిపై ఎలాంటి అధికారిక ఫిర్యాదూ నమోదు కాలేదు. ఆయన స్థానిక రాజకీయ నాయకుడు కావడంతో, భవిష్యత్తులో గొడవలు ఎందుకని భయపడిన నిర్వాహకులు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.



Click it and Unblock the Notifications