Latest Updates
-
సమ్మర్ స్పెషల్..ఎలాంటి కృత్రిమ రంగులు లేని స్వచ్ఛమైన రాజస్థానీ మట్కా కుల్ఫీ..టేస్ట్ కేక! -
డెలులు డేటింగ్ అంటే ఏంటీ?..డేటింగ్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కొత్త ట్రెండ్ ఇదే! -
బ్రెడ్ లేకుండానే బ్రెడ్ పకోడీ..టీ టైమ్లో దీని మజాయే వేరు..జస్ట్ 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
అచ్చం బేకరీ రుచితో.. ఇంట్లోనే శాండ్ విచ్ చేసుకోండిలా..పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా.. -
డెహ్రాడూన్ స్పెషల్ మటన్ భుట్వా..నెక్స్ట్ లెవల్ టేస్ట్! -
పప్పు నానబెట్టే పనే లేదు..మిగిలిపోయిన బ్రెడ్ తో 15 నిమిషాల్లో కరకరలాడే వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
April 2026 Festivals: హనుమాన్ జయంతి నుండి అక్షయ తృతీయ వరకు..ఏప్రిల్ నెల పండుగల పూర్తి జాబితా! -
ముంబై స్పెషల్ బటాటా పోహా.. ఉదయం పూట నోరూరించే, కడుపు నింపే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్! -
ఈరోజు రాశి ఫలాలు (28.03.26): శనివారం నాడు మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? -
అచ్చం హోటల్ స్టైల్ సాంబార్ కావాలా? అయితే ఈ మసాలాను ఇంట్లోనే చేసుకోండి!
వింత ఆచారం !! ఆ గుళ్లో దొంగతనం నేరం కాదు !! ఎందుకు ?
సాధారణంగా గుళ్లు అంటే.. చాలా పకడ్బంధీగా ఉంటాయి. రెండు మూడు తాళాలు వేసి.. నగలన్నింటినీ భద్రపరిచే బాధ్యతను ఆలయ అధికారి లేదా పూజారికి అప్పగిస్తారు. దేవుడికి సంబంధించిన ప్రతి విలువైన వస్తువును పదిలపరిచేలా జాగ్రత్త వహిస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయేది వింటే ఆశ్చర్యపోతారు. ఆ గుళ్లో దొంగతనం చేస్తేనే అమ్మవారి అనుగ్రహం పొందుతారట. ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా ?
ఇండియాలోని పురాతన ఆలయాల్లో దాగున్న అంతుచిక్కని రహస్యాలు
మామూలుగా ఏదైనా దొంగతనం, అపచారం చేస్తే.. ఆ దేవి ఆగ్రహానికి గురవుతారని శపిస్తుంటారు. కానీ ఆ గుడికి వచ్చిన వాళ్ల కోరికలు తీరాలంటే మాత్రం.. ఖచ్చితంగా దొంగతనం చేయాల్సిందేనట. ఎందుకంటే అదే ఆచారం. అక్కడ దొంగతనం నేరం కానేకాదట. ఈ ప్రపంచంలో ఎక్కడైనా దొంగతనం అంటే పెద్ద నేరం. కానీ అక్కడ అంతా రివర్స్.

ఆ వింత ఆలయం ఎక్కడో లేదు. మన ఇండియాలోనే. ఉత్తరాఖండ్ లో రూర్కీ జిల్లాలో చూడియాల గ్రామంలో ఉంది చూడామణి ఆలయం. పిల్లలు లేని వాళ్లు ఈ ఆలయాన్ని సందర్శిస్తే.. పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. పిల్లలు కావాలని కోరుకునే తల్లిదండ్రులు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి. అలాగే దొంగతనం చేయాలి. దొంగతనం అంటే.. నగలు కాదు.. ఒక చెక్క బొమ్మను అమ్మవారి పాదాలపై ఉంచుతారు. దాన్ని ఎవరైతే అపహరిస్తారో వాళ్లు ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మిస్తాడని ఆలయ పూజారులు చెబుతారు.
సోమనాథ్ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ఎంట్రీ..!! ఎందుకు ?
పెళ్లైన తర్వాత చాలాకాలం పిల్లలు కాని వాళ్లు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఏడాది మొత్తం తెరిచి ఉండే ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. చెక్క బొమ్మను అపహరించిన తర్వాత పిల్లలు పుట్టగానే.. మళ్లీ ఆలయానికి వచ్చి ఆ బొమ్మను అక్కడే పెట్టాలి. దాంతోపాటు మరో బొమ్మను కూడా అమ్మవారికి సమర్పించాలి.

ఈ ఆలయంలో ఉన్న వింత ఆచారం వెనక ఒక పురాణ కథ ఉంది. లాంధౌరా రాజు అడవిలో వేటకు వెళ్లాడు. అప్పుడు చూడామణి ఆలయం కనిపించి.. అమ్మవారిని తనకు బిడ్డను ప్రసాదించమని కోరాడు. అప్పుడు అమ్మవారు మాయమై.. చెక్క బొమ్మ రూపంలో రాజుకి అర్పించింది. ఆ రాజు ఆ బొమ్మను తీసుకెళ్లి పూజలు చేశాడు. ఏడాది తర్వాత రాజా, రాణికి ఒక బిడ్డ జన్మించారు. ఆ తర్వాత చూడామణి ఆలయానికి వచ్చి ఆ రాజు చెక్క బొమ్మను తిరిగి అమ్మవారికి సమర్పించారట. అలా.. ఈ సంప్రదాయంలో ఆచరణలో ఉంది.



Click it and Unblock the Notifications











