పెళ్లి పీటలెక్కబోతున్న కుమారుడికి ఆ విషయంలో ట్రైనింగ్ ఇచ్చిన తల్లి...

త్వరలో పెళ్లి చేసుకోబోయే కుమారుడికి దాల్ గురించి ట్రైనింగ్ ఇస్తున్న తల్లి.

ఇటీవలే ఆషాఢ మాసం వెళ్లిపోయింది.. శ్రావణ మాసం కూడా వచ్చేసింది.. కరోనా వైరస్ తో చాలా మంది సహజీవనం చేసేందుకు అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో కళ్యాణం వంటి కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు.

Desi Mother Gives dal tutorial to soon be married Son : Twitterati praises her great training

Image Courtesy

ఈ సమయంలోనే ఓ వరుడు త్వరలో పెళ్లి పీటలు ఎక్కి.. వధువు మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. అయితే తనకు కాబోయే కోడలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ఆ తల్లి భావించింది

అందుకే తన కుమారుడికి ఆ విషయంలో ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. దీంతో ఆ తల్లి చేసిన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆ తల్లి ఏమి చేసింది.. ఏ విషయంలో తన కుమారుడికి ట్రైనింగ్ ఇచ్చింది అనే విషయాలు తెలియాంటే ఈ స్టోరీని పూర్తి చూడాల్సిందే...

కళ్యాణం గురించి కంగారు..

కళ్యాణం గురించి కంగారు..

కళ్యాణం అంటేనే చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిల్లో ఏదో తెలియని కంగారు మొదలవుతుంది. తాము అడుగుపెట్టే అత్తారింట్లో ఎలాంటి పద్ధతులు, ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయో.. వాటికి తాము సర్దుకుంటామో లేదో అని భయపడుతుంటారు..

ప్రతి ఒక్కరూ ఉచిత సలహాలు..

ప్రతి ఒక్కరూ ఉచిత సలహాలు..

అయితే ఇదంతా ఒకప్పటి మాట.. ప్రస్తుతం ఆడపిల్లలే కాదు.. మగవారు కూడా అన్నీ నేర్చుకోవాలంటూ ప్రతి ఒక్కరూ ఉచిత సలహాలు ఇచ్చేస్తుంటారు.

తన కుమారుడికి..

తన కుమారుడికి..

ఇదే పరిస్థితి తన కుమారుడికి రాకూడదని.. మగవారికి కూడా ఈ విషయాలపై కచ్చితంగా అవగాహన ఉండాలని భావించింది ఆ తల్లి. త్వరలో పెళ్లి పీటలెక్కి.. మూడు ముళ్లు వేసి.. ఏడడుగులు నడిచి కొత్త కాపురం పెట్టే తన కొడుకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని భావించింది.

వంట చేయడం వచ్చినా..

వంట చేయడం వచ్చినా..

ఇప్పటితరం కుర్రాళ్లలో చాలా మంది మగవారికి వంట చేయడం వచ్చినప్పటికీ.. పప్పుల విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక వంటగది వైపు చూడని వారికి అది మరింత కష్టమనే చెప్పాలి. అందుకే ఆ తల్లి తన కుమారుడికి అర్థమయ్యేలా నేర్పించేందుకు వినూత్నంగా ప్రయత్నించింది.

ఓ పేపరు మీద..

ఓ పేపరు మీద..

ఆ తల్లి ఓ పేపరు మీద పప్పుదినుసుల పేర్లు రాసి.. ఆ పప్పులను ఓ కవర్ లో ఏర్పాటు చేసి వాటిని ఆ పేపరుకి అంటించి మరీ తన కొడుక్కి ఇచ్చింది. కాగా.. ఆ పేపర్ ని ఫోటో తీసి.. ఓ ఐపీఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

వైరల్ గా మారిపోయింది..

వైరల్ గా మారిపోయింది..

దీంతో అది కాస్త వైరల్ గా మారిపోయింది. ఆ తల్లి చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు విపరీతంగా మెచ్చుకుంటున్నారు. పెళ్లికి ముందు ఇలాంటి శిక్షణ ఆడవారికే కాదు.. మగాళ్లకు కూడా కచ్చితంగా అవసరమే అని కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్క తల్లి ఈ విషయంలో తమ పిల్లలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Story first published: Friday, July 24, 2020, 17:49 [IST]
Desktop Bottom Promotion