Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
రాఖీ ఏ టైంలో కట్టాలి? ఎన్ని ముడులు వేయాలి? ఎప్పుడు తీసేయాలి?..శాస్త్ర నియమాలివే
దేశవ్యాప్తంగా ఇవాళ(ఆగస్టు 9,2025) రాఖీ పండుగ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. చెల్లెల్లు తమ అన్నలకు,తమ శ్రేయోభిలాషులకు రాఖీలు కడుతున్నారు. రక్షా బంధన్.. కేవలం ఒక పండుగ కాదు, అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న స్వచ్మైన ప్రేమకు, పవిత్రమైన బంధానికి అద్దం పట్టే ఓ అపురూపమైన వేడుక. ఇది ప్రేమ, ఆప్యాయత, రక్షణ అనే మూడు అపురూపమైన భావాల కలబోత. ఈ పవిత్రమైన రోజున సోదరి తన సోదరుడి మణికట్టుకు ప్రేమగా రాఖీ కట్టి, అతని ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను మనసారా కాంక్షిస్తుంది. ప్రతిగా ఆ సోదరుడు తన జీవితాంతం ఆమెకు రక్షణగా, అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు.
అయితే సోదరి ప్రేమగా కట్టిన ఆ రాఖీని ఎప్పుడు తీసివేయాలి? కొన్ని రోజుల పాటు ఉంచుకోవాలా లేక వెంటనే తీసేయవచ్చా? అసలు రాఖీకి ఎన్ని ముడులు వేయాలి, దానికోసం ఏమైనా ప్రత్యేక నియమాలు ఉన్నాయా? చాలామంది సోదరులు తమ సోదరి ప్రేమకు గుర్తుగా రాఖీని ఏడాది పొడవునా ఉంచుకున్నా, శాస్త్రాలు దీని గురించి ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం.

రాఖీ కట్టించుకోడానికి మంచి సమయం
ఈ రోజు ఉదయం 5:24 నుండి మధ్యాహ్నం 1:24 వరకు సోదరుడికి రాఖీ కట్టడానికి అత్యంత శుభప్రదమైన సమయం.
రాఖీని ఎప్పటివరకు ఉంచుకోవాలి?
శాస్త్రాల ప్రకారం రాఖీ కేవలం ఒక అలంకార దారం కాదు, అది ఒక శక్తివంతమైన రక్షణ కవచం. లక్ష్మీదేవి బలి చక్రవర్తికి కట్టిన రక్షాబంధనం నుండే ఈ సంప్రదాయం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. మణికట్టుకు కట్టిన రాఖీ లేదా పవిత్రమైన దారంలో ఐదు రోజుల పాటు శక్తి పెరుగుతూ 11వ రోజు వరకు ఆ సానుకూల శక్తి నిలిచి ఉంటుందని నమ్మకం. అందుకే రాఖీ కట్టిన తర్వాత కనీసం 24 గంటల నుండి గరిష్టంగా 15 రోజుల లోపు దానిని మణికట్టు మీద ఉంచుకోవడం ఉత్తమం. ఆ తర్వాత దానిని గౌరవంగా తీసి పారే నీటిలో లేదా ఏదైనా పవిత్రమైన చెట్టు మొదట్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ దారంలోని దివ్యశక్తి ప్రకృతిలో కలిసిపోతుంది.
రాఖీకి ఎన్ని ముడులు వేయాలి? ప్రతి ముడి వెనుక అర్థం
రాఖీ కట్టేటప్పుడు ముడుల సంఖ్యకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంప్రదాయం ప్రకారం నాలుగు ముడులు వేయడం అత్యంత శుభప్రదం. ప్రతి ముడి ఒక ప్రత్యేక ప్రార్థనకు ప్రతీక.

మొదటి ముడి: సోదరుడి దీర్ఘాయుష్షు కోసం, అతను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ వేస్తారు.
రెండవ ముడి: రాఖీ కడుతున్న సోదరి కూడా నిండు జీవితాన్ని, సుఖసంతోషాలను పొందాలని ఆకాంక్షిస్తూ వేస్తారు. ఇది పరస్పర శ్రేయస్సును కోరుకోవడాన్ని సూచిస్తుంది.
మూడవ ముడి: అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ఈ పవిత్ర బంధం, ప్రేమ ఎప్పటికీ చెక్కుచెదరకుండా కలకాలం నిలవాలని ప్రార్థిస్తూ వేస్తారు.
నాల్గవ ముడి: తమ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ, ఆ దైవం తన సోదరుడికి ఎల్లవేళలా అండగా ఉండి, అన్ని ఆపదల నుండి కాపాడి, అతని కోరికలన్నీ నెరవేర్చాలని మనసారా వేడుకుంటూ వేస్తారు.
ఈ నాలుగు ముడులతో కట్టిన రాఖీ ఒక సాధారణ దారంలా కాకుండా ఒక దివ్యమైన రక్షణ కవచంగా మారి సోదరుడిని కాపాడుతుందని ప్రగాఢ విశ్వాసం.



Click it and Unblock the Notifications