Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఒకే వేదికపై సద్గురు నుంచి బాబా రాందేవ్ వరకు..అంబానీ పెళ్లిలో ఆధ్యాత్మిక ప్రభ
ఈ రోజుల్లో పెళ్లిళ్లు అంటే కళ్లు చెదిరే ఆడంబరాలు, గ్లామర్ ప్రదర్శనలుగా మారిపోయాయి. అయితే అనంత్ అంబానీ,రాధికా మర్చంట్ ల వివాహం శుభారంభం అనే పదానికి సరికొత్త అర్థాన్నిచ్చింది. వీరి ఏడడుగుల బంధానికి కేవలం బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రపంచ కుబేరులే కాకుండా భారతదేశంలోని అత్యంత గౌరవనీయ ఆధ్యాత్మిక గురువులు కూడా హాజరై ఆశీస్సులు అందించారు. దీంతో ఈ వివాహం ధర్మం, సంస్కృతి, దైవానుగ్రహాల సంగమంగా, ఒక మహాయజ్ఞంలా అనిపించింది. ప్రాచీన వేదమంత్రాల ఘోష, దేశ నలుమూలల నుంచి వచ్చిన సాధుసంతుల ఆశీర్వచనాలతో ఈ వివాహ వేదికపై విశ్వాసం, సంప్రదాయం, ఆధునికత అద్భుతంగా మేళవించాయి.
ఆధ్యాత్మిక అతిథుల అపూర్వ సంగమం
ఈ వివాహ వేడుకలో భారతదేశంలోని అత్యంత ప్రముఖ పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. విభిన్న ఆధ్యాత్మిక మార్గాలకు చెందినవారైనా కూడా అందరూ అనంత్,రాధిక జంటకు శుభం కలగాలని మనసారా దీవించారు. ఇటీవలి చరిత్రలో ఇంతమంది మహనీయులు ఒకే వివాహ వేడుకకు తరలిరావడం ఇదే మొదటిసారి.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ఈ వివాహానికి హాజరై..వివాహం కేవలం ఒక ఒప్పందం కాదు, అదొక పవిత్రమైన అవకాశం. అనంత్,రాధిక ఈ మార్గంలో అంకితభావం, అందరినీ కలుపుకుపోయే తత్వంతో నడవాలి అని ఆశీర్వదించారు.
యోగా గురు బాబా రాందేవ్.. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలని రాధిక,అనంత్ అంబానీ దంపతులను దీవిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
స్వామి చిదానంద్ సరస్వతి.. అంతర్గత శాంతి, పర్యావరణ పరిరక్షణ అనే ఆశీస్సులను అందిస్తూ సనాతన విలువలకు పెద్దపీట వేసినందుకు అంబానీ కుటుంబాన్ని ప్రశంసించారు.
వర్తమాన కాలంలోని గొప్ప పండితులలో ఒకరైన జగద్గురు రాంభద్రాచార్య.. నూతన దంపతులకు మేధస్సు, వివేకం, ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించమని ఆశీర్వదించారు.
స్వామి సదానంద సరస్వతి, స్వామి అవిముక్తేశ్వరానంద్..ఆధ్యాత్మిక సంస్కరణలలో ప్రముఖులైన ఈ స్వాములు.. ధార్మిక క్రమశిక్షణ, జీవిత లక్ష్యంపై స్పష్టతతో ముందుకు సాగాలని అనంత్ రాధిక జంటను దీవించారు.
బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి అయిన యువ గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి.. భక్తి, రక్షణ, నిర్భయమైన విశ్వాసంతో జీవించాలని ఆశీర్వదించారు.
జునా అఖాడాకు చెందిన స్వామి అవధేశానంద్ గిరి.. ప్రత్యేకంగా హోమం, వేద ప్రవచనం నిర్వహించి యజ్ఞం, తపస్సు, నిస్వార్థ ప్రేమ అనే సూత్రాలతో జీవించాలని ఆశీర్వదించారు.
ప్రఖ్యాత భాగవత ప్రవచనకర్త దేవకీ నందన్ ఠాకూర్ జీ..తన మధురమైన ప్రవచనాలతో వివాహానికి ఆధ్యాత్మిక శోభను తెచ్చారు. "వివాహం ఇద్దరు ఆత్మల ప్రయాణం, కానీ ధర్మంతో నడిస్తే అది జన్మజన్మల ప్రయాణంగా మారుతుందని అన్నారు.
తన ఆధ్యాత్మిక ప్రవచనాలకు పేరుగాంచిన రమేష్భాయ్ ఓజా.. దయ, నమ్మకం, ఆధ్యాత్మిక ఆనందంతో సామరస్యపూర్వక వైవాహిక జీవితాన్ని గడపాలని సూచించారు.
భారతదేశ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ, జైన సన్యాసులు, టిబెటన్ బౌద్ధ పండితులు కూడా నిశ్శబ్ద ధ్యాన వేడుకలలో తమ ఆశీస్సులు అందించారు.

ఆశీస్సులతో నిండిన పవిత్ర క్రతువులు
ఈ ఆధ్యాత్మిక గురువుల ఉనికి కేవలం నామమాత్రం కాదు అదే ఈ వేడుకకు కేంద్ర బిందువు. గణపతి పూజ, నవగ్రహ పూజ నుంచి వేద వివాహ సంస్కారం వరకు ప్రతి క్రతువును ఈ గురువుల మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన పురోహితులు, పండితులు నిర్వహించారు. ప్రధాన వేడుకలో నాలుగు వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామ వేదం, అథర్వ వేదాలలోని సూక్తాలను పఠించారు.ప్రాచీన భారత దేవాలయాల స్ఫూర్తితో నిర్మించిన వివాహ మండపం, మంత్రఘోషలతో, అగ్నిహోత్రపు జ్వాలలతో, సాధుసంతుల ఆశీర్వచనాలతో ఒక దివ్యమైన శక్తి కేంద్రంగా మారింది.
నీతా, ముఖేష్ అంబానీల వ్యక్తిగత విశ్వాసం
భారతీయ సంప్రదాయాలంటే ఎంతో భక్తి కలిగిన నీతా అంబానీ ఎప్పటినుంచో దేవాలయాల పరిరక్షణ, గంగా ప్రక్షాళన వంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. ఆమె మాట్లాడుతూ మా రాధిక, అనంత్ల వైవాహిక జీవితం ఆడంబరాలతో కాదు, ప్రార్థనలతో మొదలవ్వాలని మేము కోరుకున్నాం. మా గురువుల ఆశీస్సుల కన్నా విలువైనది ఏదీ లేదు అని అన్నారు.

ముఖేష్ అంబానీ కూడా ఒక ప్రైవేట్ సత్సంగంలో ఆధ్యాత్మిక గురువులందరికీ భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలుపుతూ..మా ధర్మాచార్యులు ఈ వివాహాన్ని పవిత్రంగా మార్చడం వల్లే, ఇది నిజంగా దైవిక వేడుకగా మారిందని అన్నారు.
ఆధునిక భారతానికి ఒక బలమైన సందేశం
పాశ్చాత్య పోకడలను అనుకరించే ఎందరో ఉన్నత వర్గాల పెళ్లిళ్ల మధ్య, అంబానీ-మర్చంట్ వివాహం భారతదేశపు ఆధ్యాత్మిక మూలాల వైపు అందరి దృష్టిని మళ్లించింది. భక్తి, జ్ఞాన, యోగ, కర్మ, శుద్ధ ధర్మ మార్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గురువుల ఆశీస్సులతో, ఇది కేవలం ఒక పెళ్లి కాదు..వేడుక రూపంలో జరిగిన ఒక ఆధ్యాత్మిక జాగృతి.



Click it and Unblock the Notifications











