Vijay Diwas 2022: విజయ్ దివాస్ అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటాం, ప్రాముఖ్యత ఏంటంటే?

1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత దేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఏటా డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివస్ పేరుతో వేడుకలు జరుపుకుంటాం.

Vijay Diwas 2022: 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత దేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఏటా డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివస్ పేరుతో వేడుకలు జరుపుకుంటాం.

Vijay Diwas 2022: Date, History, Significance of Indias Victory over Pakistan in the 1971 war

భారత రక్షణ దళాల ధైర్యాన్ని, త్యాగాలను స్మరించుకోవడానికి ఏటా విజయ్ దివస్‌గా స్మరించుకుంటాం. దీంతో పాటు 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత దేశం సాధించిన విజయానికి గుర్తుగా జులై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటాం.

Vijay Diwas 2022: Date, History, Significance of Indias Victory over Pakistan in the 1971 war

విజయ్ దివస్ చరిత్ర, ప్రాముఖ్యత

1970 ఎన్నికల్లో పాకిస్థాన్‌లో ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీ అవామీ లీగ్ గెలుపొందింది. ఆ తర్వాత తూర్పు పాకిస్థాన్ అయిన ఇప్పటి బంగ్లాదేశ్‌లో బెంగాలీ మాట్లాడే మెజారిటీ ప్రజల పట్ల పాక్ మిలిటరీ అనుచితంగా ప్రవర్తించడం ప్రారంభించింది. స్వతంత్ర్యం కోసం అక్కడి ప్రజలు అలుపెరగని పోరాటం చేశారు. ఆ పోరాటం ఉద్ధృతమై 1971లో పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైంది.

బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్ పాక్‌తో పోరాడింది. 13 రోజుల యుద్ధంలో భారత్ పైచేయి సాధించింది. డిసెంబర్ 16న పాక్ సైన్యం లొంగిపోయి, యుద్ధంలో ఓడిపోయినట్లు అంగీకరించింది. అలా పాక్ నుండి బంగ్లాదేశ్ విముక్తి పొందింది.

అప్పటి నుండి డిసెంబర్ 16ను భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లో విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం.

Vijay Diwas 2022: Date, History, Significance of Indias Victory over Pakistan in the 1971 war

ఈ సంవత్సరం వేడుకలు:

దిల్లీ ఆర్మీ హౌస్‌లో విజయ్ దివస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పర్యవేక్షణలో విజయ్ దివస్ వేడుకలు జరిగాయి. ఎట్ హోం పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సైనికాధికారులు పాల్గొన్నారు.

ఆర్మీ హౌస్ ఆవరణలో విజయ్ దివస్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. 93 వేల మంది పాక్ సైనికుల లొంగుబాటు, బంగ్లాదేశ్ యుద్ధం, పాక్ నుండి విముక్తి పొంది బంగ్లాదేశ్ సన్నివేశాలను ప్రదర్శించారు. వీటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తిలకించారు.

Story first published: Friday, December 16, 2022, 10:47 [IST]
Desktop Bottom Promotion