Latest Updates
-
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే..
Vijay Diwas 2022: విజయ్ దివాస్ అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటాం, ప్రాముఖ్యత ఏంటంటే?
1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్థాన్పై భారత దేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఏటా డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివస్ పేరుతో వేడుకలు జరుపుకుంటాం.
Vijay Diwas 2022: 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్థాన్పై భారత దేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఏటా డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివస్ పేరుతో వేడుకలు జరుపుకుంటాం.

భారత రక్షణ దళాల ధైర్యాన్ని, త్యాగాలను స్మరించుకోవడానికి ఏటా విజయ్ దివస్గా స్మరించుకుంటాం. దీంతో పాటు 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్పై భారత దేశం సాధించిన విజయానికి గుర్తుగా జులై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటాం.

విజయ్ దివస్ చరిత్ర, ప్రాముఖ్యత
1970 ఎన్నికల్లో పాకిస్థాన్లో ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీ అవామీ లీగ్ గెలుపొందింది. ఆ తర్వాత తూర్పు పాకిస్థాన్ అయిన ఇప్పటి బంగ్లాదేశ్లో బెంగాలీ మాట్లాడే మెజారిటీ ప్రజల పట్ల పాక్ మిలిటరీ అనుచితంగా ప్రవర్తించడం ప్రారంభించింది. స్వతంత్ర్యం కోసం అక్కడి ప్రజలు అలుపెరగని పోరాటం చేశారు. ఆ పోరాటం ఉద్ధృతమై 1971లో పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైంది.
బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్ పాక్తో పోరాడింది. 13 రోజుల యుద్ధంలో భారత్ పైచేయి సాధించింది. డిసెంబర్ 16న పాక్ సైన్యం లొంగిపోయి, యుద్ధంలో ఓడిపోయినట్లు అంగీకరించింది. అలా పాక్ నుండి బంగ్లాదేశ్ విముక్తి పొందింది.
అప్పటి నుండి డిసెంబర్ 16ను భారత్తో పాటు బంగ్లాదేశ్లో విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం.

ఈ సంవత్సరం వేడుకలు:
దిల్లీ ఆర్మీ హౌస్లో విజయ్ దివస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షణలో విజయ్ దివస్ వేడుకలు జరిగాయి. ఎట్ హోం పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సైనికాధికారులు పాల్గొన్నారు.
ఆర్మీ హౌస్ ఆవరణలో విజయ్ దివస్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. 93 వేల మంది పాక్ సైనికుల లొంగుబాటు, బంగ్లాదేశ్ యుద్ధం, పాక్ నుండి విముక్తి పొంది బంగ్లాదేశ్ సన్నివేశాలను ప్రదర్శించారు. వీటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తిలకించారు.



Click it and Unblock the Notifications