Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా?
ప్రస్తుతం చాలామంది జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనికి తోడు తగినంత ఎక్సర్ సైజ్ లేకపోవడం వల్ల చాలామందికి ప్రధాన సమస్యలు గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి. అలాంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు మన వంటగదిలో ఉండే దినుసులే అద్భుతంగా పనిచేస్తాయి. అందులో ముఖ్యమైనది వాము.

వామును నేరుగా తినలేని వారు, ఎంతో రుచికరమైన వాము పరాఠా చేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి. ఇది గ్యాస్ నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఎన్నో అద్భుత ప్రయోజనాలున్న వాము పరాఠాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా..
వాము పరాఠా తయారీకి కావలసిన పదార్థాలు
గోధుమ పిండి - 2 కప్పులు
వాము - 1 నుంచి 1.5 టీస్పూన్ల వరకు
నెయ్యి లేదా నూనె - పరాఠాలు కాల్చడానికి
ఉప్పు - మీ రుచికి సరిపడా
కొత్తిమీర ఆకులు - సన్నగా తరిగిన
నీరు - పిండిని కలపడానికి తగినంత
వాము పరాఠా తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండిని జల్లించి వేసుకోవాలి. ఇప్పుడు వామును తీసుకుని మీ రెండు అరచేతుల మధ్య ఉంచి తేలికగా నలపాలి. ఇలా చేయడం వల్ల వాములోని సువాసన, ఔషధ గుణాలు పిండికి బాగా పడతాయి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక చెంచా కరిగించిన నెయ్యి వేసి అన్నీ కలిసేలా పిండిని బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో కొద్దికొద్దిగా నీరు పోస్తూ, ఎక్కడా ముద్దలు లేకుండా మృదువైన పిండిలా కలుపుకోవాలి. పరాఠాలు చాలా మెత్తగా, సులభంగా వంగేలా రావాలంటే, కలిపిన పిండిపై ఒక మూతను ఉంచి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-పక్కన పెట్టిన పిండిని తీసుకుని మీడియం సైజ్ లో ఉండే చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని పొడి పిండి చల్లుతూ చపాతీ కర్రతో గుండ్రంగా ఒత్తుకోవాలి. పరాఠా మరింత మృదువుగా, పొరలు పొరలుగా రావాలంటే, గుండ్రంగా ఒత్తిన చపాతీపై కాస్త నెయ్యి రాసి, చిటికెడు కారం చల్లుకోవాలి. ఆ తర్వాత దానిని ట్రయాంగిల్ లేదా గుండ్రంగా మడతపెట్టి, మళ్లీ పరాఠాలా ఒత్తుకోవాలి.
-స్టవ్ మీద పెనం పెట్టి మీడియం మంటపై వేడి చేయండి. పెనం వేడెక్కాక ఒత్తి పెట్టుకున్న పరాఠాను దానిపై వేయండి. ఒక వైపు కాస్త రంగు మారాక, రెండో వైపుకు తిప్పాలి. రెండు వైపులా కొద్దిగా నెయ్యి లేదా నూనె రాస్తూ, పరాఠా మంచి బంగారు రంగులోకి వచ్చి కరకరలాడేంత వరకు గరిటెతో తేలికగా ఒత్తుతూ కాల్చుకోవాలి. అంతే వేడి వేడి వాము పరాఠా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications