Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Ganga Vilas: అతి పొడవైన రివర్ క్రూయిజ్ జర్నీ.. విలాసం, వినోదం, చుక్కలు చూపించే ధర
గంగా విలాస్ క్రూయిజ్ నౌక ప్రయాణం ఎలా సాగుతుంది, ఎలాంటి పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించొచ్చు, జర్నీ ఎన్ని రోజులు ఉంటుంది, ఇందులో ప్రయాణించాలంటే టికెట్ ధర ఎంత అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
3 వేల 200 కిలోమీటర్ల ప్రయాణం, 51 రోజుల జర్నీ, అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు, వావ్ అనిపించే అంశాలు, స్పా, గేమ్స్ ఇంకా ఎన్నో విశేషాలు అవన్నీ ఒకే నౌకలో దాని పేరే ఎంవీ గంగా విలాస్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ యాత్ర ఇది. ఈ ప్రయాణం ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నుండి అస్సాంలోని డిబ్రూగర్హ్ వరకు ఉంటుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎంవీ గంగా విలాస్ క్రూయిజ్ను ప్రారంభించారు. గంగా విలాస్ క్రూయిజ్ నౌక ప్రయాణం ఎలా సాగుతుంది, ఎలాంటి పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించొచ్చు, జర్నీ ఎన్ని రోజులు ఉంటుంది, ఇందులో ప్రయాణించాలంటే టికెట్ ధర ఎంత అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారీ ఓడ, ఎన్నో సౌకర్యాలు:
(image: twitter/tourismgoi)
* ఎంవీ గంగా విలాస్ క్రూయిజ్ 62 మీటర్ల పొడవు ఉంటుంది.
* 12 మీటర్ల వెడల్పు, 1.4 మీటర్ల లోతు ఉంటుంది.
* గంగా విలాస్ క్రూయిజ్లో 18 సూట్ రూములు ఉంటాయి.
* గంగా విలాస్లో ఒకేసారి 36 మంది ప్రయాణించవచ్చు.
* ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి 3,200 కిలోమీటర్ల దూరంలోని అస్సాం డిబ్రూగర్హ్ వరకు 51 రోజుల్లో వెళ్తుంది.
* ఈ క్రూయిజ్ ప్రయాణించే దారి వెంట ఉండే ప్రాంతాలు వాటి సంస్కృతుల నుండి ప్రేరణ పొంది ఈ నౌకను తీర్చిదిద్దారు. రంగులు, డిజైన్లు వాటి నుండే తీసుకున్నారు.
* గంగా విలాస్ క్రూయిజ్ అత్యంత విలాసంగా ఉంటుంది.
* సీలింగ్ కిటికీల నుండి రోజంతా ప్రకృతి అందాలు చూడవచ్చు.
* లాంజ్లో సెమీ స్లీపర్ సీట్లలో కూర్చుని ఎంజాయ్ చేయవచ్చు.
* ప్రయాణికులకు కాలక్షేపం కోసం చాలా సౌకర్యాలు ఉంటాయి.
* గంగా విలాస్ క్రూయిజ్లో స్పా, బాడీ మసాజ, జిమ్, సెలూన్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

చుక్కలో టికెట్ ధర:
(image: twitter/tourismgoi)
* ఎంతో సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఈ క్రూయిజ్ను తీర్చిదిద్దారు.
* ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండే సౌకర్యాలు ఇందులో ఉంటాయి. అందుకే టికెట్ ధరలు కూడా భారీగానే ఉంటాయి.
* ఈ క్రూయిజ్లో ఒక్కరోజు ప్రయాణించాలంటే రూ. 25 వేల కంటే ఎక్కువ ఖర్చవుతుంది.
* ఈ నౌక మొత్తం 51 రోజుల పాటు సాగుతుంది. 51 రోజుల పాటు ఇందులో గడపాలంటే మాత్రం రూ.12.59 లక్షలు చెల్లించాల్సిందే.
* ఈ ఎంవీ గంగా విలాస్ నౌకను పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దారు.
* ఈ నౌక నదిలో ప్రయాణించేటప్పుడు ప్రకృతికి ఎలాంటి నష్టం కలిగించకుండా ఉండేలా ప్రత్యేకంగా దీనిని తీర్చిదిద్దారు.
* ఈ నౌక నుండి ఎలాంటి కాలుష్యం వెలువడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
* శబ్ధం రహితంగా, కాలుష్య రహితంగా సాగుతుంది గంగా విలాస్ ప్రయాణం.
* వీటితో పాటు విలాసవంతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచడంతో టికెట్ ధరలు భారీగా ఉన్నాయి.

ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తుందంటే..
* ఎంవీ గంగా విలాస్ క్రూయిజ్ ప్రయాణం 51 రోజుల పాటు సాగుతుంది.
* వారణాసి నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది.
* ఘాజీపూర్, బక్సర్, రామ్నగర్ మీదుగా 8వ రోజు పాట్నా చేరుకుంటుంది.
* పాట్నా నుండి పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు వెళ్తుంది.
* కోల్కతా నుండి పక్క దేశం బంగ్లాదేశ్లోకి వెళ్తుంది.
* బంగ్లాదేశ్లో 15 రోజుల పాటు ఈ క్రూయిజ్ విహరిస్తుంది.
* తర్వాత అస్సాంలోకి ప్రవేశిస్తుంది.
* చివరికి డిబ్రూగర్హ్కు చేరుకోవడంతో 51 రోజుల ప్రయాణం ముగుస్తుంది.
51 రోజులూ ప్రయాణించక్కర్లేదు:
ఎంవీ గంగా విలాస్ క్రూయిజ్లో ప్రయాణించాలనుకుంటే మొత్తం 51 రోజులు వెళ్లాల్సిందేనా అనే డౌట్ రావొచ్చు. చాలా మంది ఇన్ని రోజుల పాటు ప్రయాణించలేరు. అందుకే ఒక చోటు నుండి మరో చోటు వరకు వెళ్లేలా కూడా ఈ క్రూయిజ్లో ప్రయాణించవచ్చు.
చాలా ప్రాంతాల గుండా గంగా విలాస్ క్రూయిజ్ ప్రయాణిస్తుంది. అందులో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కొంత మొత్తం చెల్లించి ప్రయాణించవచ్చు.
ఏమేం చూడొచ్చంటే..
* ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
* జాతీయ ఉద్యానవనాలు
* నది ఘాట్లు
* బీహార్లోని పాట్నా
* ఝార్ఖండ్లోని సాహిబ్గంజ్
* పశ్చిమ బెంగాల్లోని కోల్కతా
* బంగ్లాదేశ్లోని ఢాకా
* అస్సాంలోని గౌహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు.



Click it and Unblock the Notifications











