బిడ్డకు అవాంఛనీయ సంఘటన జరిగితే!

By B N Sharma

Childabuse
ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లలపై అమిత ప్రేమ చూపుతారు. బేబీ సురక్షితంగా ఎట్టి జబ్బులు లేదా ఎట్టి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూస్తారు. అయినప్పటికి కొన్ని పరిస్ధితులలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగి వాటి ప్రభావం బేబీపై బాగా పడుతుంది. అవేమిటో పరిశీలించి జాగ్రత్త పడండి.

బిడ్డను శారీరకంగా, లైంగికపరంగా, లేదా భావావేశాలతోను లేదా నిర్లక్ష్యానికి గురయ్యేట్లు చేస్తారు. ఈ ప్రక్రియ ప్రపంచ దేశాలన్నిటిలోను వుంది. ఈ పరిస్ధితి బేబీలకు మానసికంగా నష్టం కలిగిస్తుంది. బేబీలకు మానసిక నష్టం ఇంటివద్ద లేదా స్కూళ్ళు లేదా బేబీ సహజంగా వుండే ఇతర చోట్ల జరుగుతుంది. దీనినే ఛైల్డ్ ఎబ్యూస్ లేదా బిడ్డను దుర్వినియోగం చేయటం లేదా బిడ్డకు నష్టపరచడంగా కూడా చెప్పచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ మేరకు బిడ్డలు నాలుగు రకాలుగా దుర్వినియోగం చేయబడతారు. అవి నిర్లక్ష్య పరచటం, శారీరకంగా బాధించడం, మానసికంగా నిందించడం, లైంగికపరంగా వాడటం అని చెప్పచ్చు.

ఈ రకమైన బిడ్డలపై చేసే ఘాతుకాలు వారి శారీరక, మానసిక ఆరోగ్యాలపై విపరీతంగా ప్రభావిస్తుంది. కొన్ని సమయాలలో బేబీకి పూడ్చలేని గాయాన్ని లేదా నష్టాన్ని కూడా కలిగిస్తుంది. బిడ్డ పై ఘాతుకం జరిగిందని తెలియగానే, వీలైనంత త్వరగా రికవరీ చర్యలు చేపట్టి సరైన చికిత్సతో కోలుకొనేలా చేయాలి.

Story first published: Monday, December 26, 2011, 14:51 [IST]
Desktop Bottom Promotion