మహిళకు మరో రుతుస్రావం ఎపుడు?

By B N Sharma

Postnatal
డెలివరీ అయిన తర్వాత మహిళకు విపరీతమైన అలసట, జనాంగ నొప్పి, స్తనాల సమస్యలు, వెన్ను నొప్పి, హెమరాయిడ్లు, మలబద్ధకం, డిప్రెషన్, రక్తహీనత, తలనొప్పి, మూత్ర సంబంధిత సమస్యలు ఎన్నో వస్తాయి. వీటిలో ఏది బాధించినప్పటికి మహిళ తక్షణమే వైద్యులను సంప్రదించాలి.

మహిళకు మరోసారి రుతుస్రావం వారి శారీరక పరిస్ధితినిబట్టి వుంటుంది. బిడ్డకు పాలు పడుతూంటే, రుతుస్రావం లేటుగా అవుతుంది. కొంతమందికి పాలు పడుతున్నప్పటికి పిరీయడ్స్ వచ్చేస్తాయి. పిల్లలకు బాటిల్ పాలు పట్టే మహిళలు నాలుగు నుండి ఆరు వారాలలోపు పిరీయడ్స్ పొందే అవకాశం వుంది. కనుక పిరీయడ్స్ వెంటనే రాకూడదంటే మహిళ బిడ్డకు ఘన ఆహారం ఇచ్చేవరకు పాలు పడుతూనే వుండాలి.

బేబీ పుట్టిన తర్వాత మహిళ తన ఆరోగ్యం పట్ల అధిక జాగ్రత్త తీసుకోవాలి. ఈ సమయంలో హాస్పిటల్ లేదా ఇంటి వద్ద విశ్రాంతి పొందాలి. సాధారణ జననం అయితే మూడు నుండి 4 రోజులు సిజేరియన్ జననం అయితే ఒక వారంపాటు హాస్పిటల్ లో వుండాల్సివస్తుంది. ప్రతిరోజు వైద్య పరీక్ష జరగాలి. టెంపరేచర్, నాడి కొట్టుకోవడం, రక్తపోటు, గర్భాశయ ఎత్తు, స్తనాలు, చనుమొనలు రక్తస్రావం లేదా ఇతర సమస్యలలేవైనా వుంటే అవి పరీక్షిస్తారు.

Story first published: Tuesday, December 20, 2011, 17:10 [IST]
Desktop Bottom Promotion