పాలు పడితే స్తనాలు మెత్తపడతాయా?

By B N Sharma

Breastfeeding Facts For New Mothers!
కొత్తగా తల్లులయ్యే మహిళలకు బిడ్డలకు పాలు ఇవ్వటంలో ఎన్నో సందేహాలుంటాయి. పాలు పడితే తమ స్తన సౌందర్యం పోతుందని, మరోమారు పూర్వపు ఆకారాన్ని, పటుత్వాన్ని స్తనాలు సంతరించుకోలేవని, పాలు పట్టినందువలన బాగా సాగిపోయి వేలాడతాయని భావిస్తూ వుంటారు.

1. కనుక మొదటగా పాలుపట్టే తల్లి తన స్తనాలు సాగిపోయే అవకాశం ఎట్టి పరిస్ధితిలోను లేదని గ్రహించాలి. పాలు పట్టినందువలన ఆమె రొమ్ములు మరోమారు పూర్వపు ఆకారాన్ని త్వరగా పొందే అవకాశం వుంటుంది. ఈ చర్య ఆమెలోని కొవ్వును ఖర్చు చేస్తుంది. గర్భాశయం పూర్వపు రూపు సంతరించుకోడానికి అవసరమైన హార్మోన్లు రిలీజ్ అవుతాయి.

2. రెండో వాస్తవమేమంటే, తల్లి తన స్తనాల పాలు పట్టటం బిడ్డకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. తల్లిబాలలో కల యాంటీ బాడీస్ బిడ్డకు జబ్బులు రాకుండా చేస్తుంది. బేబీకి గజ్జి, ఎలర్జీ, ఆస్తమా వంటివి రావు. అంతేకాదు, తాజా పరిశోధనల మేరకు తల్లిపాలు తాగిన పిల్లలకు డయాబెటీస్ కూడా రాదని తేలింది.

3. తల్లిపాలు పట్టినందువలన ఆమెకు తర్వాతి జీవితంలో ఆరోగ్య సమస్యలుండవు. బ్రెస్ట్ కేన్సర్, గర్భ కేన్సర్ వంటివి వచ్చే అవకాశం వుండదు.

4. రొమ్ము సైజును బట్టి పాలు తయారవుతాయనిచాలామంది భావిస్తారు. కాని పాలగ్రంధుల పరిమాణాన్ని బట్టి పాలు తయారవుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక ఈ కారణంగా బిడ్డకు తల్లి పాలు పట్టకుండా వుండరాదు.

5. బిడ్డకు జలుబు చేసిందని, దగ్గువస్తోందని తల్లులు తమ పాలను నిలిపేస్తారు. కాని ఇది సరికాదు. తల్లి తీవ్రంగా జబ్బు పడితే తప్ప, బిడ్డకు పాలు పట్టటం ఆపరాదు. తల్లి ఏదేని తీవ్ర జబ్బు పడితే, ఆమెలోని రోగక్రిములు పాల ద్వారా బిడ్డకు సంక్రమించే అవకాశం వుంది.

6. పాలు పడితే స్తనాలు మెత్తబడిపోతాయనేది మహిలలలో వుంటుంది. మెత్తబడినప్పటికి అది తాత్కాలికంగా జరిగే ప్రక్రియ అని బిడ్డ సరిగా పాలు తాగుతూంటే మరోమారు పాలు ఇవ్వటం ఆగిన వెంటనే మహిళ కొద్దిపాటి వ్యాయామాలతో తన స్తనాల సౌందర్యం కాపాడుకోవచ్చునని గ్రహించాలి.

Story first published: Sunday, April 8, 2012, 12:22 [IST]
Desktop Bottom Promotion