తరచుగా మూత్ర విసర్జనా?

By B N Sharma

Why Do Pregnant Woman Urinate?
గర్భవతులైన స్త్రీలు తరచుగా మూత్రం చేస్తారు. ఇది గర్భం దాల్చారనటానికి సంకేతం. ఈ దశ సుమారుగా మొదటి మూడు నెలల గర్భం కాలంలోను ఆరువారాలు కొనసాగుతుంది. గర్భవతులైతే శరీరంలో రక్తం పెరుగుతుంది. కనుక అదనపు ద్రవం చేకూరుతుంది. ఈ అధిక ద్రవం కిడ్నీల ద్వారా శుద్ధి చేయబడి బ్లాడర్ కు చేరుతుంది. గర్భవతి దశలో బేబీ మూత్రపు సంచిపై ఒత్తిడి కలిగిస్తుంది. దాంతో ఆమెకు తరచుగా మూత్రం చేయాలనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించటానికిగాను కాఫీ, టీ లేదా ఇతర డ్రింకులు మానేయాలి. సాధారణంగా గర్భవతి స్త్రీలు రాత్రులందు ఎక్కువ మూత్ర విసర్జన చేస్తారు. దీనికి కారణం పగటిపూట కాళ్ళలోను, పాదాలలోను వున్న ద్రవమంతా పడుకునే సరికి బ్లడ్ ప్రవాహం చేరి అక్కడినుండి యూరిన్ బ్లాడర్ కు చేరుతుంది. మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయటానికిగాను గర్భిణీ స్త్రీలు యూరిన్ చేసేటపుడు ముందుకు వంగి చేయాలి. దీనితో అధిక సార్లు చేయటం కూడా తప్పుతుంది.

వెడల్పు అవుతున్న గర్భాశయం కూడా యూరినరీ బ్లాడర్ పై ఒత్తిడి తెస్తుంది. దీనితో బ్లాడర్ ఖాళీగా వున్నప్పటికి ఆమె తరచుగా మూత్రానికి వెళ్ళాలన్న భావనను కలిగి వుంటుంది. గర్భవతి సమయంలో కిడ్నీలు శరీరంలోని మలిన పదార్ధాలను బయటకు నెట్టివేయడానికి ఎంతో శ్రమిస్తాయి. ఈ కారణంగా కూడా మూత్రానికి వెళ్ళాలనే భావన కలుగుతుంది. ఇది సాధారణం మరియు ప్రకృతి సిద్ధం. గర్భవతి తర్వాతి దశలలో క్రమేణా ఈ భావన దూరమవుతుంది.

మూత్రం చేసిన తర్వాత ఏదేని నొప్పి లేదా మంట అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. ఇది మూత్రాశయ ద్వారంలో ఇన్ఫెక్షన్ కావచ్చు. గర్భిణీ స్త్రీలలో ఇది సాధారణంగా వుండేదే. అయితే దీనికి వైద్యం చేయకుంటే, అది మూత్రాన్ని కూడా కలుషితం చేసే ప్రమాదముంది. దాని ఫలితంగా కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదముంది. గర్భవతైన తర్వాత కూడా మూత్రాన్ని కొద్ది రోజులు పరిశీలించాలి. కొద్ది రోజుల తర్వాత సాధారణ దశకు చేరుతుంది.

Story first published: Wednesday, August 31, 2011, 11:54 [IST]
Desktop Bottom Promotion