Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
కార్తీక మాసం స్పెషల్: కర్ణాటక స్టైల్ మసాలా చిత్రాన్నం..10 నిమిషాల్లో లంచ్ బాక్స్ రెడీ
మసాలా చిత్రాన్నం అనేది దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా కర్ణాటకలో చాలా ప్రసిద్ధి చెందిన, రుచికరమైన, సులభంగా తయారుచేసుకోగలిగే వంటకం. దీనిని ఉదయం అల్పాహారంగా, మధ్యాహ్నం భోజనంలో లేదా ఉపవాసాల సమయంలో కూడా తయారుచేస్తారు. లంచ్ బాక్స్ రెసిపీగా చాలా ప్రసిద్ధి. తక్కువ సమయంలో, సులభంగా, పోషకాలు అందిస్తూ రుచిగా ఉండే వంటకాన్ని తినాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.
సాధారణ చిత్రాన్నం(లెమన్ రైస్)కంటే మసాలా చిత్రాన్నంలో కొబ్బరి, మసాలాలను కలిపి తయారుచేసే ప్రత్యేకమైన పేస్ట్ ఉపయోగించడం వలన దీనికి మరింత ఘాటైన, ప్రత్యేకమైన రుచి వస్తుంది. కార్తీక మాసం సందర్భంగా ఉల్లి,వెల్లుల్లి లేకుండానే మసాలా చిత్రాన్నం ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-కరివేపాకు
-కొత్తిమీర
-వేరుశెనగపప్పు
-పచ్చిశెనగప్పు
-మినపప్పు
-జీలకర్ర
-ఆవాలు
-లవంగాలు
-అల్లం తురుము
-దాల్చిన చెక్క
-పచ్చికొబ్బరి
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-నూనె
-ఉప్పు
-పసుపు
-ఇంగువ
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఒకటింపావు కప్పు కడిగిన బియ్యం, రెండుంపావు కప్పుల నీరు, 1 టీస్పూన్ నూనె,కొంచెం ఉప్పు వేసి అన్నాన్ని వండుకున్నట్లుగా వండుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
-తర్వాత చిత్రాన్నం పేస్ట్ తయారీకోసం..మిక్సీ గిన్నెలో అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ అల్లం తురుము, 1 రెబ్బ కరివేపాకు, అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, పిడికెడు కొత్తిమీర కాడలతో సహా వేసి కొంచెం నీళ్లు కలుపుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చెయ్యాలి. వేడెక్కిన నూనెలో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగపప్పు వేసి చిట్లనిచ్చాక ఇందులో 1 టీస్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, అరటేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి వేసి వేయించాలి.
-తాలింపు బాగా వేగిన తర్వాత అందులో 1 రెబ్బ కరివేపాకు, చిటికెడు ఇంగువ, అర టీస్పూన్ జీలకర్ర వేసి వేపాలి.
-వేగిన తాలింపులోనే గ్రైండ్ చేసిన చిత్రాన్నం పేస్ట్ వేసి బాగా కలిపి 2 నిమిషాలు వేయించాలి. పేస్ట్ లోని చెమ్మ ఆరిన తర్వాత ఇందులో అర టీస్పూన్ పసుపు వేసి 1 నిమిషం వేయించాక ఇందులో ఉడికించి పూర్తిగా చల్లారిన అన్నం, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
-చివర్లో కావాలనుకుంటే కొంచెం నిమ్మరపం కూడా కలుపుకోవచ్చు. అంతే మసాలా చిత్రాన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications