Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది!
వేడి వేడి ఇడ్లీ అయినా, కరకరలాడే దోశ అయినా.. దానికి సరైన జోడీ చట్నీ ఉంటేనే ఆ మజా వస్తుంది. కానీ రోజువారీ చేసే రొటీన్ చట్నీలతో మీకు బోర్ కొట్టిందా? మీ ఇంట్లో వాళ్లకు పల్లీల చట్నీ అంటే మహా ఇష్టమా? అయితే ఈసారి కాస్త కొత్తగా, ఘాటుగా, రుచికరంగా ఉండే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ ట్రై చేసి చూడండి.
ఈ చట్నీ చేస్తే చాలు మీ ఇంట్లో వాళ్లు రోజూ తినేదాని కంటే మరో రెండు ఇడ్లీలు, దోశలు అదనంగా లాగించేస్తారు. నోరూరించే ఆంధ్రా స్టైల్ వేరుశనగ కారం చట్నీ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చి పల్లీలు (వేరుశెనగ గుళ్లు) - పావు కప్పు
నూనె - 4 టేబుల్ స్పూన్లు
సాధారణ ఎండు మిర్చి - 5
కాశ్మీరీ ఎండు మిర్చి - 2
పెద్ద ఉల్లిపాయ - 1
పెద్ద టమాటా - 1
చింతపండు - ఒక చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 3
ఉప్పు - రుచికి తగినంత
ఆవాలు - అర టీస్పూన్
కరివేపాకు - ఒక కట్ట
ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. అందులో పావు కప్పు పచ్చి పల్లీలు వేసి, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి దోరగా వేయించాలి. పల్లీలు మాడిపోకుండా కరకరలాడే వరకు వేయించుకుని, వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన చల్లారనివ్వాలి.
-ఇప్పుడు అదే పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాస్త వేడెక్కాక అందులో ఎండు మిర్చి, కాశ్మీరీ ఎండు మిర్చి వేసి కొన్ని సెకన్ల పాటు దోరగా వేయించాలి. అవి వేగుతున్నప్పుడే ఒక చిన్న చింతపండు ముక్క వేసి కలపాలి. ఆ తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
-ఉల్లిపాయలు కాస్త రంగు మారి పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడి, గుజ్జులా అయ్యేంత వరకు ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి ఒకసారి పొడిలా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత చల్లారిన ఉల్లి-టమాటా-మిర్చి మిశ్రమాన్ని జార్ లో వేయాలి. అవసరమైనన్ని నీళ్లు పోసుకుని, మెత్తని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-చివరిగా చట్నీకి ప్రాణం పోసే పోపు పెట్టుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి మిగిలిన నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. చివరగా కరివేపాకు వేసి వేయించి, ఆ ఘుమఘుమలాడే పోపును తీసుకువెళ్లి చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి.
-అంతే నోరూరించే, కమ్మటి, ఘాటైన ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ రెడీ. వేడి వేడి ఇడ్లీ మీద కొద్దిగా నెయ్యి వేసుకుని, ఈ చట్నీని అద్దుకుని తింటుంటే ఆ రుచి అమృతంలా ఉంటుంది. దోశ, వడ, ఉతప్పం.. ఇలా దేనితోనైనా ఇది సూపర్ కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications