Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
గుజరాతీ స్పెషల్ మేథీ ఢేబ్రా..ప్రయాణాలకు పర్ఫెక్ట్ తోడు
గుజరాతీ వంటకాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకం మేథీ ఢేబ్రా. ఢేబ్రా అంటే గుజరాతీలో ఒక రకమైన ఫ్లాట్ బ్రెడ్ లేదా రొట్టె. మేథీ అంటే మెంతులు లేదా మెంతికూర.
మేథీ ఢేబ్రాలు అల్పాహారంగా, సాయంత్రం స్నాక్స్ గా, ప్రయాణాలలో తీసుకువెళ్ళడానికి కూడా అద్భుతంగా ఉంటాయి. ఇవి చాలా మృదువుగా ఉండి, కొన్ని రోజుల వరకు తాజాగా ఉంటాయి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
సజ్జ పిండి- 1 కప్పు
గోధుమ పిండి-అర కప్పు
జొన్న పిండి - పావు కప్పు
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
తాజా మెంతికూర- 2 కప్పులు
పుల్లటి పెరుగు- అర కప్పు
బెల్లం- పావు కప్పు
అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీస్పూన్
కారం- 1 టీస్పూన్
ధనియాల పొడి- 1 టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
వాము- అర టీస్పూన్
తెల్ల నువ్వులు- 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా
నూనె- 3 టేబుల్ స్పూన్లు
గోరువెచ్చని నీరు- పిండి కలపడానికి
తయారీ విధానం
-ముందుగా మెంతికూర కాడల నుండి ఆకులను వేరు చేయండి. వాటిని ఒక పెద్ద గిన్నెలో నీరు పోసి, కొద్దిగా ఉప్పు వేసి 10 నిమిషాలు నానబెట్టండి. తర్వాత 2-3 సార్లు కడిగి, నీరు పూర్తిగా పోయేలా ఒక జల్లెడలో ఉంచండి.
-ఆకులు ఆరిన తర్వాత, వాటిని చాలా సన్నగా తరగండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో 1 అంగుళం అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2-3 పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు ఒక పెద్ద,వెడల్పాటి గిన్నెలో సజ్జ పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, బియ్యం పిండి వేసి బాగా కలపాలి. తర్వాత ఈ పిండి మిశ్రమంలో సన్నగా తరిగిన మెంతికూర, అల్లం-వెల్లుల్లి-పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము,తెల్ల నువ్వులు, ఉప్పు వేసి 2 నిమిషాలు కలపండి.
-ఇప్పుడు అందులో తురిమిన బెల్లం, పుల్లటి పెరుగు, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపండి.
-పిండి పొడిగా అనిపిస్తే, కొద్దికొద్దిగా గోరువెచ్చని నీటిని చేర్చుకుంటూ పిండిని కలపండి. పిండి గట్టిగా ఉండకూడదు. మరీ మెత్తగా ఉంటే ఒత్తడానికి కష్టమవుతుంది.
-పిండిని బాగా కలిపిన తర్వాత దానిపై కొద్దిగా నూనె రాసి, ఒక తడి బట్ట లేదా మూత పెట్టి 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
-తర్వాత పిండిని నిమ్మకాయ సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి.
-ఒక చపాతీ పీట తీసుకుని, దానిపై కొద్దిగా పొడి గోధుమ పిండి లేదా సజ్జ పిండిని చల్లండి. ఒక్కో పిండి ఉండను తీసుకుని, పొడి పిండిలో అద్ది చపాతీ కర్రతో చిన్న చపాతీ సైజులో, కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి వేడెక్కిన తర్వాత ఒత్తిన ఢేబ్రాను దానిపై వేసి నూనె వేసి రెండు వైపులా బంగారు గోధుమ రంగు మచ్చలు వచ్చే వరకు కాల్చండి. అంతే మేథీ ఢేబ్రా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications