Latest Updates
-
డేటింగ్ యాప్స్లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే! -
సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
బుద్ధ పూర్ణిమ ఈసారి ఎప్పుడొస్తోంది? బ్యాంక్ పనులు ఉన్నవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! -
మేష రాశిలోకి బుధుడు: ఈ రాశులవారికి ఇక మాటల్లో పదును.. నిర్ణయాల్లో దూకుడు! -
కన్య, ధనస్సు, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉందో చూడండి! - బుధవారం, 29 ఏప్రిల్ 2026 -
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు!
పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా..వైరల్ ఫిష్ ఫ్రై ఈజీగా ఇలా చేసేయండి
సీఫుడ్ ప్రియులకు చేపల వేపుడు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరకరలాడే ఫిష్ ఫ్రై ఉంటే చాలు కంచం మొత్తం ఖాళీ చేసేయొచ్చు. ఎప్పుడూ రొటీన్గా చేసుకునే వేపుడు కాకుండా, కొద్దిగా కొత్తగా, అద్భుతమైన రుచితో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఒక స్పెషల్ వైరల్ ఫిష్ ఫ్రై ట్రై చేస్తే ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు.
ఈ రెసిపీ కోసం ఇక్కడ చందువా చేపలను ఉపయోగిస్తారు. అయితే మీరు మీ అభిరుచికి తగ్గట్టుగా మీకు నచ్చిన ఏ చేపలైనా వాడుకోవచ్చు. మరి నోరూరించే మసాలా ఫిష్ ఫ్రై సులభంగా ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
మసాలా ఫిష్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
చందువా చేపలు (Silver Pomfret) - 500 గ్రాములు
కొబ్బరి నూనె - 15 ml
పసుపు - అర టీస్పూన్
కాశ్మీరీ కారం - 4 టీస్పూన్లు
దంచిన మిరియాల పొడి - 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
సాంబార్ ఉల్లిపాయలు- 5 నుండి 7
కరివేపాకు - ఒక రెమ్మ
చింతపండు గుజ్జు -తగినంత
ఉప్పు - తగినంత
మసాలా ఫిష్ ఫ్రై తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించకుండానే ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకోండి. అందులో కొబ్బరి నూనె వేసి, దానికి పసుపు, కాశ్మీరీ కారం, రుచికి సరిపడా ఉప్పు, దంచిన మిరియాల పొడి వేసి బాగా కలపండి. ఇవన్నీ నూనెలో కలిసి ఒక చిక్కటి పేస్ట్ లాగా మారాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు మాడిపోకుండా ఉంటాయి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, మంటను సిమ్ లో ఉంచి ఆ పాన్ పెట్టండి. ఈ మసాలా మిశ్రమాన్ని ఒక 30 సెకన్ల పాటు వేయించండి. ఆ తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జును అందులో వేసి మరో నిమిషం పాటు ఉడికించండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, దంచిన చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి.
-ఇప్పుడు అందులో చాకుతో గాట్లు పెట్టుకున్న చేపలను ఆ పాన్ లో వేయండి. పాన్ లోని మసాలా అంతా చేపలకు రెండు వైపులా సమానంగా పట్టేలా చూడండి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి చేపలను వేయించుకోవాలి. మధ్యమధ్యలో చేపలను రెండు వైపులా తిప్పుతూ ఉండాలి. ఇలా 3 నుండి 4 సార్లు తిప్పడం వల్ల మసాలా లోపలికి వెళ్లి చేపలు అద్భుతంగా ఉడుకుతాయి.
-చేపలు పూర్తిగా ఉడికి, లోపల జ్యూసీగా, పైన క్రిస్పీగా తయారవ్వడానికి సుమారు 8 నుండి 10 నిమిషాల సమయం పడుతుంది. చేపలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.
-అంతే ఎంతో ఘుమఘుమలాడే ఫిష్ ఫ్రై రెడీ. వేడి వేడి అన్నంలోకి ఈ పుల్లపుల్లని, కారంకారంగా ఉండే మసాలా ఫిష్ ఫ్రైని నంచుకుని తింటుంటే.. ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












