Latest Updates
-
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట!
15 నిమిషాల్లోనే రుచి,ఆరోగ్యం..నోరూరించే పాలక్ దోస..ఎలా చేసుకోవాలంటే
ఉదయం పూట హడావిడిలో ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? రోజూ తినే ఇడ్లీ, దోసలకు భిన్నంగా, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే టిఫిన్ కోసం చూస్తున్నారా? కేవలం 15 నిమిషాల్లో, ప్రోటీన్, ఫైబర్, పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. అదే నోరూరించే పాలక్ దోస. పాలక్ దోస కేవలం ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా ఉండటమే కాదు, దాని రుచి మిమ్మల్ని మళ్లీ మళ్లీ తినేలా చేస్తుంది. పాలకూరలోని అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఈ వంటకాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతాయి.పాలక్ దోస ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
పాలక్ దోస తయారీకీ కావాల్సిన పదార్థాలు
-బియ్యం - 2 కప్పులు
-మినపప్పు - అర కప్పు
-తాజా పాలకూర - 2 కప్పులు
-పెరుగు - అర కప్పు
-పచ్చిమిర్చి - 2
-అల్లం తురుము - 1 టేబుల్ స్పూన్
-కొబ్బరి తురుము - అర కప్పు
-ఉప్పు - రుచికి సరిపడా
-నెయ్యి/నూనె - దోసెలు వేయించడానికి
తయారీ విధానం
-ముందుగా బియ్యం, మినపప్పును కడిగి కనీసం 4-6 గంటలు విడివిడిగా నానబెట్టాలి. తర్వాత నీటిని వంపేసి రెండింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని రాత్రంతా లేదా కనీసం 6-8 గంటలు పులియబెట్టాలి.
-శుభ్రం చేసిన పాలకూరను వేడినీటిలో రెండు నిమిషాలు ఉంచి వెంటనే చల్లటి నీటిలో వేయాలి. దీనివల్ల పాలకూర రంగు, పోషకాలు పోకుండా ఉంటాయి.
-ఇప్పుడు పాలకూర, పచ్చిమిర్చి, అల్లం కొబ్బరి తురుమును మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
-పులిసిన దోస పిండిలో ఈ పాలకూర పేస్ట్, పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి వేడి చేయాలి. కొద్దిగా నెయ్యి రాసి, ఒక గరిటెడు పిండిని తీసుకుని గుండ్రంగా, పల్చగా దోసెలా వేసుకోవాలి.
-మీడియం మంటపై దోసె బంగారు రంగులోకి, క్రిస్పీగా మారే వరకు కాల్చి, రెండో వైపుకు తిప్పి ఒక్క నిమిషం పాటు కాల్చాలి. అంతే వేడివేడి, టేస్టీ, హెల్తీ పాలక్ దోస రెడీ. దీనిని కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో తింటే... ఆ రుచే వేరు.
కొన్ని ప్రయోజనాలు
రక్తహీనతకు చెక్: పాలకూరలో ఐరన్, విటమిన్ A, K, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించి, మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతాయి.
బరువు అదుపులో: బియ్యం, మినపప్పుల కలయిక శరీరానికి అవసరమైన ప్రోటీన్ను అందిస్తుంది. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూస్తుంది. ఇది బరువును నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థకు మేలు: దోస పిండిని పులియబెట్టడం వల్ల దానిలోని
పోషకాలు మన శరీరం తేలికగా గ్రహించేలా మారతాయి. ఇది పేగు ఆరోగ్యానికి
చాలా మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









