Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
ఎండాకాలం వచ్చేసింది. మండుతున్న ఎండల దెబ్బకు మధ్యాహ్నం పూట వేడివేడి అన్నం, కారంకారంగా ఉండే కూరలు తినాలంటేనే మనసు అంగీకరించదు. ఇలాంటి సమయంలో కడుపుకు చల్లగా, నోటికి కమ్మగా ఏదైనా తినాలనిపిస్తుంది. అప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది పెరుగన్నం.
పెరుగు తినడం వల్ల శరీరానికి తక్షణ చలవ దొరుకుతుంది. ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే, రోజూ తినే సాధారణ పెరుగన్నం కంటే, దానికి కాస్త స్పెషల్ టచ్ ఇస్తే ఎలా ఉంటుంది? కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు జోడించి చేస్తే, ఆ రుచికి ఇంట్లో వాళ్లంతా ఫిదా అవ్వాల్సిందే.

వేసవిలో శరీరాన్ని చల్లబరిచి, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే స్పెషల్ పెరుగన్నం'ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పెషల్ పెరుగన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
అన్నం (మెత్తగా ఉడికించినది) - 1 కప్పు
గట్టి పెరుగు - 2 కప్పులు
పాలు - అర కప్పు
ఆవాలు - 1 టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి)
ఎండుమిర్చి - 2
అల్లం తరుగు - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన ముక్కలు)
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - రెండు రెమ్మలు
దానిమ్మ గింజలు - పావు కప్పు
ద్రాక్ష పండ్లు - గుప్పెడు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
స్పెషల్ పెరుగన్నం తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. పప్పులు ఎర్రగా మారుతున్నప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడేలా వేయించి స్టవ్ కట్టేయాలి. ఈ తాలింపు మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేయాలి. అన్నం మరీ పలుకుగా కాకుండా, గరిటెతో కొద్దిగా మెత్తగా అయ్యేలా స్మాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల అన్నం పెరుగును బాగా పీల్చుకుని కమ్మటి రుచిని ఇస్తుంది.
-ఈ మెత్తటి అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తురిమిన అల్లం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్న కమ్మటి గట్టి పెరుగును వేయాలి. ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఉంది. నీళ్లకు బదులుగా కాచి చల్లార్చిన పాలు పోసి కలపాలి. దీంతో పెరుగన్నం త్వరగా పుల్లగా మారకుండా, రోజంతా కమ్మగా ఉంటుంది.
-ఇప్పుడు పక్కన పెట్టుకున్న తాలింపు మిశ్రమాన్ని ఇందులో వేసి కలపాలి. దానిమ్మ గింజలు, ద్రాక్ష పండ్లను పైన చల్లుకోవాలి. చివరగా మీ రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే నోరూరించే స్పెషల్ పెరుగన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications