Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్తో చపాతీ కంటే సాఫ్ట్గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే!
ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయాన్నే తినే ఫుడ్ చాలా ముఖ్యం. కానీ రోజూ అదే ఇడ్లీ, అదే దోస, లేదా ఉప్మా తింటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన బ్రేక్ఫా స్ట్ ఆప్షన్ కోసం మీరు చూస్తున్నట్లయితే మల్టీగ్రెయిన్ దోస(బహుధాన్యాల దోస) మీకు పర్ఫెక్ట్.
కేవలం బియ్యం, మినపపప్పుతోనే కాకుండా రకరకాల పప్పులు, చిరుధాన్యాలతో తయారు చేసే ఈ దోసలో ప్రోటీన్లు, ఫైబర్, శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, ఎంతో కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది. మల్టీగ్రెయిన్ దోసను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఇడ్లీ బియ్యం - 1 కప్పు
మినపపప్పు - అర కప్పు
పెసలు (లేదా పెసరపప్పు) - అర కప్పు
పసుపు పెసరపప్పు - అర కప్పు
కందిపప్పు - అర కప్పు
రాజ్ గిర (అమరాంత్) - అర కప్పు
రాగులు - అర కప్పు
అటుకులు- అర కప్పు
మెంతులు - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 2
అల్లం - 1 అంగుళం ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - తగినంత
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా?
తయారీ విధానం
-మొదటగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఇడ్లీ బియ్యం, మినపపప్పు, పెసలు, పసుపు పెసరపప్పు, కందిపప్పు, రాజ్ గిర, రాగులు, మెంతులు అన్నీ వేయండి. వీటన్నింటినీ శుభ్రమైన నీటితో కనీసం మూడు నాలుగు సార్లు బాగా కడగాలి.
-నీరు పారదర్శకంగా కనిపించేంత వరకు కడిగిన తర్వాత, అందులో తగినన్ని మంచి నీళ్లు పోసి సుమారు 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఆ నీటిని వంపేసి, మరోసారి శుభ్రమైన నీటితో కడిగి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న ధాన్యాలు, పప్పులు, అటుకులను అందులో వేయండి. వీటికి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు జత చేయండి. సాధారణ దోస పిండిలాగా చిక్కగా రావడానికి కొద్దిగా మాత్రమే నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవడం మంచిది.
-మెత్తగా రుబ్బుకున్న పిండిని ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని, మూతపెట్టి రాత్రంతా అలా ఉంచండి.
-రాత్రంతా పులియబెట్టడం వల్ల ఉదయానికి పిండి బాగా పొంగి, పరిమాణం పెరుగుతుంది. ఇప్పుడు గరిటతో పిండిని మెల్లగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి.
-అంతే ఎంతో ఆరోగ్యకరమైన హై ప్రోటీన్ దోస పిండి రెడీ. మీకు కావలసినంత పిండిని వేరే గిన్నెలోకి తీసుకుని, మిగిలిన పిండిని ఫ్రిజ్ లో భద్రపరుచుకుంటే రెండు మూడు రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది.
-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక, కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి పిండిని పల్చగా దోసలా పోసుకోవాలి. రెండు వైపులా దోరగా, కరకరలాడేలా కాల్చుకుంటే వేడివేడి మల్టీగ్రెయిన్ దోస రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
