Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే..
హోలీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది రంగుల కోలాహలం,స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చేసే సందడి. అయితే ఈ పండుగ సంబరాలు కేవలం రంగులు, నీళ్ల ఆటలకే పరిమితం కాదు. నోరూరించే పిండివంటలు, ముఖ్యంగా చల్లని థాండాయ్ లేనిదే హోలీ పండుగ అసంపూర్ణమనే చెప్పాలి.
ఉదయం నుండి ఎండలో రంగులతో ఆడి అలిసిపోయిన శరీరానికి, ఎండిన గొంతుకు ఒక్క గ్లాసు చల్లని థాండాయ్ తగిలితే ఆ మజాయే వేరు. ఇది కేవలం దాహాన్ని తీర్చడమే కాదు, తక్షణ శక్తిని ఇచ్చి మిమ్మల్ని మళ్లీ ఉత్సాహంగా మార్చేస్తుంది. ఈ హోలీకి మీ అతిథులను ఆకట్టుకునేలా అద్భుతమైన థాండాయ్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
బాదంపప్పులు: 8-10
జీడిపప్పులు: 8-10
పిస్తాపప్పులు: 8-10
పుచ్చకాయ గింజలు: 1 టేబుల్ స్పూన్
గసగసాలు: 1 టేబుల్ స్పూన్
సోంపు: 1 టేబుల్ స్పూన్
ఆకుపచ్చ యాలకులు: 4-5
నల్ల మిరియాలు: 4-5
ఎండిన గులాబీ రేకులు: కొద్దిగా
కుంకుమపువ్వు: కొద్దిగా
చక్కెర: 2 టేబుల్ స్పూన్లు
చల్లని పాలు: 1 లీటరు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో బాదంపప్పులను వేసి సుమారు 10 నిమిషాల పాటు నానబెట్టండి. మరొక గిన్నెలో జీడిపప్పు, పిస్తాపప్పు, పుచ్చకాయ గింజలు, గసగసాలు, సోంపు వేసి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి.
-10 నిమిషాల తర్వాత బాదంపప్పుల తొక్కను సులభంగా తీసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, గింజలన్నీ వేయండి. దీనికి కొద్దిగా పాలు జతచేసి, చాలా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి.
-యాలకులు, నల్ల మిరియాలు, ఎండిన గులాబీ రేకులను మిక్సీలో వేసి మెత్తని పొడిలా తయారు చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పాలు తీసుకుని అందులో కుంకుమపువ్వు వేసి పక్కన ఉంచండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పాలను పోసి బాగా మరిగించండి. పాలు మరుగుతున్నప్పుడు మీ రుచికి సరిపడా చక్కెర వేసి, అది పూర్తిగా కరిగేలా కలపండి.
-చక్కెర కరిగిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకున్న కుంకుమపువ్వు పాలను వేసి కలపాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ను పాలలో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద 2-3 నిమిషాల పాటు ఉడికించాలి.
-ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న యాలకులు, మిరియాలు, గులాబీ రేకుల పొడిని పాలలో వేసి బాగా కలపాలి. మీకు మరింత రిచ్ టేస్ట్ కావాలంటే ఉడుకుతున్న పాలలో కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ లేదా ఫ్రెష్ క్రీమ్ కలుపుకోవచ్చు.
-స్టవ్ ఆఫ్ చేసి మంచి సువాసన కోసం ఒక చెంచా రోజ్ వాటర్ కలపండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనిచ్చి, ఫ్రిజ్ లో పెట్టి బాగా కూల్ చేయాలి.
-సర్వ్ చేసే ముందు గ్లాసుల్లో పోసి పైన సన్నగా తరిగిన పిస్తా, బాదం పలుకులతో గార్నిష్ చేసి ఇస్తే తాగేకొద్దీ తాగాలనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications