Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్.. అచ్చం అదే టేస్ట్లో ఇలా చేసుకోండి,మూతి నాకేస్తారు అంతే!
రాజమండ్రి అంటేనే అందరికీ గుర్తొచ్చేది రోజ్ మిల్క్. రాజమండ్రి వెళ్లిన ప్రతి ఒక్కరు రోజ్ మిల్క్ టేస్ట్ చేసి మరీ వెళ్తారు. అంత అద్భుతమైన రుచితో ఇది ఉంటుంది మరి. కేవలం రాజమండ్రిలోనే కాదు యావత్ భారత దేశంలో ఈ రోజ్ మిల్క్ ఇష్టపడని వారంటూ ఉండరు. అచ్చం రాజమండ్రి రోజ్ మిల్క్ టేస్ట్ వచ్చేలా.. ఈ రోజ్ మిల్క్ తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. అయితే సరైన పద్దతిలో దానిని చేసుకోవడం అనేది ముఖ్యం. ఈ రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రోజ్ మిల్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
కాచి చల్లార్చిన పాలు
పచ్చి కోవా
రోజ్ సిరప్
యాలకుల పొడి
కుంకుమపువ్వు
ఐస్ క్యూబ్స్
చక్కెర (రుచికి తగినంత)
రోజ్ మిల్క్ తయారు చేసే విధానం:
ఒక గిన్నెలో కాచి చల్లార్చిన పాలను తీసుకుని, అందులో కావలసినంత రోజ్ సిరప్ వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఆ పాలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో కొద్దిగా పాలు తీసుకొని వేడి చేయాలి.
అందులో పచ్చి కోవాను చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఆ కోవా పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కోవా మొత్తం కరిగిన తరువాత అందులో చెక్కర వేసుకొని బాగా కలపాలి. కోవా, పాలు రెండూ దగ్గర పడే వరకు బాగా కలుపుకోవాలి.
చివరగా యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసుకొని దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. ఆ తరువాత ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని, అందులో తయారు చేసిన కోవా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ తరువాత దానిపై రోజ్ మిల్క్ బేస్ను పోసుకొని బాగా కలుపుకుంటే.. రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ రెడీ అయినట్లే. ఇలాగే చేసుకుంటే మీకు కూడా కచ్చితంగా రాజమండ్రి టేస్ట్ వచ్చేలా రోజ్ మిల్క్ వచ్చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications