Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్లో పడినట్లే.!
సంవత్సరమైనా పాడవకుండా ఉండే బియ్యం వడియాలు.. సింపుల్గా ఎలా చేసుకోవాలంటే?
మన తెలుగు ప్రజలకు పచ్చళ్ళు, అప్పడాలు, రోటి పచ్చలు, వడియాలు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అందుకే నెలల ముందే పచ్చళ్ళు పెట్టుకొని నిలువ ఉంచుకొని తింటుంటారు. వాటిలో ముఖ్యమైనది వడియాలు. వీటిని చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాగే దీనిని చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక రెండు రోజులు జోరుగా ఎండ కాసిందంటే చాలు వడియాలు వేసేసి ఇంటి మేడపైన ఆరబెట్టేస్తారు. ఒకసారి చేసుకుంటే ఏడాదిపాటు వచ్చే ఈ వడియాలు ఎన్ని రోజులైనా పాడవకుండా, రుచికరంగా ఉండేలా ఎలా చేసుకోవాలో మేము ఇక్కడ వివరించాము. మేము చెప్పిన విధంగా ఓసారి ట్రై చేసి.. మీ ఫ్రెండ్స్, అండ్ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి.
ముందుగా బియ్యం వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం
- మూడు కప్పుల బియ్యం
- తొమ్మిది కప్పుల నీళ్లు
- ఒక స్పూన్ వాము
- రెండు స్పూన్ల జీలకర్ర
- పావు కప్పు నువ్వులు
- రుచికి సరిపడా ఉప్పు

బియ్యం వడియాలు తయారీ విధానం
ఈ బియ్యం వడియాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు వేసి ఉడికించాలి. మనం మూడు కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి.. తొమ్మిది కప్పుల నీళ్లు గిన్నెలో పోసుకోవాలి. ఆ నీటిని సలసలా మరిగే వరకు మరిగించుకోవాలి. నీళ్లు బాగా మారిగాకా అందులో మూడు కప్పుల బియ్యం వేసుకోవాలి. అలాగే అదే నీళ్లలో రుచికి సరిపడా ఉప్పును కూడా జత చేసుకోవాలి.
ఇప్పుడు అందులో వాము, జీలకర్ర, నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకొని గిన్నెపైన మూత పెట్టుకోవాలి. బియ్యం, నీళ్లు అన్ని చిక్కగా, గట్టిగా, మందంగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి బియ్యంను చల్లారేవరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చీరను బాగా ఎండ తగిలే ప్రాంతంలో పరుచుకొని.. బియ్యం మిశ్రమాన్ని వడియాల మాదిరిగా పరుచుకోవాలి. అలాగే జంతికల యంత్రంలో ఉంచుకొని జంతికల మాదిరిగా వచ్చే విధంగా కూడా ఈ వడియాలు వేసుకోవచ్చు.
ఇంకొందరు తెల్లని వస్త్రంపై అప్పడాల మాదిరిగా ఉంచుకొని ఎండబెట్టుకుంటారు. ఈ విధంగా కూడా వడియాలు రుచికరంగా ఉంటాయి. అలా వివిధమైన వస్త్రాలపై ఈ వడియాలు రెండు రోజుల పాటు ఎర్రటి ఎండలో ఎండబెడితే వడియాలు సిద్ధమైనట్లే. ఎండిన వడియాలు గిన్నెలో వేసుకున్నప్పుడు గలగలామని శబ్దం వినిపిస్తుంది. అప్పుడే వడియాలు ఎండినట్లు అర్ధం చేసుకోవాలి. వీటిని గాలి దూరని డబ్బాలో ఉంచుకొని నిలువ చేసుకుంటే ఎన్ని నెలలైనా పాడవకుండా అలానే ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications