Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ మాకరోనీ సలాడ్.. ఇప్పుడు మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు, మరణాల కలకలం.. ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ.! -
భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచే తప్పులు ఇవే.. మనస్పర్థలు తొలగాలంటే ఇలా చేయండి.! -
కూల్ డ్రింక్ సీసాలను ఇలా ఓపెన్ చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా.. ఈ పొరపాట్లు ఇకపై వద్దు.! -
గుత్తి వంకాయతో మసాలా చేసి బోర్ కొడితే ఇలా కొత్తగా ట్రై చేయండి.. వదలకుండా తినేస్తారు.! -
పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై వయసు ప్రభావం.. ఎంతవరకు వాస్తవం.? -
పిల్లల ఫేవరెట్ ‘ఆలూ’.. రెస్టారెంట్ టేస్ట్తో అదరగొట్టే దమ్ బిర్యానీ.! -
వర్షాకాలంలో వీటిని తినే ముందు జాగ్రత్త.. లేదంటే వాంతులు, విరేచనాలు తప్పవు.! -
వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఇలా చేస్తే నో టెన్షన్ -
చిల్ అవ్వడానికి చోటు ఏదైతేనేం.. భారీ వర్షంలోనూ ‘సిట్టింగ్’.. మందుబాబుల వైరల్ వీడియో.!
అచ్చం బిర్యానీని మించే రుచితో.. ఘుమఘుమలాడే కరివేపాకు మసాలా రైస్ ఎలా చేసుకోవాలంటే..
సాధారణంగా పులిహోర, నిమ్మకాయ అన్నం, లేదా కొబ్బరి అన్నం లాంటివి అందరికీ బాగా అలవాటే. అయితే ఎప్పుడూ అవే కాకుండా కొంచెం కొత్తగా, వెరైటీగా ట్రై చేయాలని ఉందా? అయితే మీరు కచ్చితంగా రుచి చూడాల్సిన అద్భుతమైన వంటకం కరివేపాకు మసాలా రైస్. ఇందులో వాడే మసాలా దినుసులు దీనికి అచ్చం బిర్యానీ లాంటి అద్భుతమైన రుచిని, సువాసనను ఇస్తాయి. ఉదయం పూట హడావిడిగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు, వంట నేర్చుకుంటున్న బ్రహ్మచారులకు, అలాగే పిల్లల లంచ్ బాక్స్ కి ఈ కరివేపాకు మసాలా రైస్ ఒక బెస్ట్ ఆప్షన్.

కరివేపాకు మసాలా రైస్ తయారీకి కావాల్సినవి
వండిన అన్నం - అర కప్పు (లేదా ఒక పెద్ద బౌల్)
నూనె - 3 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - 1
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ఉడికించిన పచ్చి బఠానీలు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి - 2
జీడిపప్పు - కొద్దిగా
కరివేపాకు - పావు కప్పు (తాజాది)
నువ్వులు - 1 టేబుల్ స్పూన్
మినపపప్పు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టేబుల్ స్పూన్
కరివేపాకు మసాలా రైస్ తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించుకుని, ఒక వెడల్పాటి గిన్నెలో ఆరబెట్టుకోవాలి.
- స్టవ్ మీద ఒక బాండీ పెట్టి, అందులో మినపపప్పు వేసి మీడియం మంట మీద 2 నిమిషాల పాటు దోరగా వేయించాలి. ఆ తర్వాత నువ్వులు వేసి వేయించండి.
-నువ్వులు చిటపటలాడుతూ, పప్పు బంగారు రంగులోకి మారుతున్నప్పుడు కరివేపాకు, జీలకర్ర వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆపేయాలి. ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువ మొత్తంలో తయారుచేసుకుని, గాలి చొరబడని సీసాలో వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు.
ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు పారదర్శకంగా మారాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీలను వేసి కొద్దిసేపు వేయించాలి. మసాలా అడుగంటకుండా ఉండాలంటే కొద్దిగా నీళ్లు చల్లి కలుపుకోవాలి.
-ఈ మిశ్రమం కాస్త చిక్కబడ్డాక, ముందుగా ఆరబెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి నెమ్మదిగా కలపాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని, సరిపడా ఉప్పును వేసి అన్నానికి పట్టేలా బాగా కలపాలి.
-స్టవ్ ను మీడియం మంట మీద ఉంచి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఆపేయాలి. చివరగా నెయ్యిలో దోరగా వేయించిన జీడిపప్పును అన్నం పైన చల్లుకోవాలి.
--అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన కరివేపాకు మసాలా రైస్ రెడీ. దీనికి సైడ్ డిష్ గా రైతా ఉంటే భోజనం అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications