Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
చుక్క నీరు,ఉల్లి,వెల్లుల్లి లేకుండానే..జార్ఖండ్ ఫేమస్ అత్తే మటన్..దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే!
మటన్.. ఈ పేరు వినగానే మాంసాహార ప్రియుల నోట్లో నీళ్లు ఊరడం ఖాయం. వీకెండ్ వచ్చిందంటే చాలు, చాలామంది ఇళ్లలో ఘుమఘుమలాడే మటన్ కూర ఉడికిపోవాల్సిందే. మటన్ తో రకరకాల వంటకాలు చేస్తుంటారు. అయితే, సాధారణంగా మటన్ వండాలంటే బోలెడంత ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రేవీ కోసం నీళ్లు వాడటం మనకు అలవాటు. కానీ, మీరు ఎప్పుడైనా జార్ఖండ్ లోని డియోఘర్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ అత్తా మటన్ రుచి చూశారా?
ఈ అత్తే మటన్ తయారీ విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో చుక్క నీరు కూడా పోయరు. ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా వాడరు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, పాతకాలం నాటి సాంప్రదాయ పద్ధతిలో వండే ఈ మటన్ రుచి మాత్రం జన్మలో మర్చిపోలేరు. కేవలం స్వచ్ఛమైన నెయ్యి, నిండు మసాలా దినుసులతో మాత్రమే దీనిని వండుతారు. డియోఘర్ స్పెషల్ అత్తే మటన్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

అత్తే మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత మటన్ - 1 కిలో
నెయ్యి - 400 గ్రాములు
బిర్యానీ ఆకు
పచ్చ యాలకులు
నల్ల యాలకులు
లవంగాలు
జీలకర్ర
దాల్చినచెక్క
జాపత్రి
నల్ల మిరియాలు
దంచిన పచ్చిమిర్చి
దంచిన అల్లం
ఉప్పు
అత్తే మటన్ తయారీ విధానం
-ముందుగా ఒక కిలో తాజా, లేత మటన్ తెచ్చుకోవాలి. దానిని రెండు మూడు సార్లు శుభ్రమైన నీటిలో బాగా కడిగి, నీరు మొత్తం పోయేలా వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి ఇనుప కడాయిని పొయ్యి మీద పెట్టండి. ఇనుప పాత్రలో వండటం వల్ల మటన్ కు అద్భుతమైన రుచితో పాటు మంచి రంగు కూడా వస్తుంది. కడాయి వేడెక్కాక అందులో 400-500 గ్రాముల నెయ్యి వేయాలి.
-నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులో ఘుమఘుమలాడే మసాలా దినుసులన్నింటినీ (బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క తదితరాలు) వేసి వేయించాలి.
-మసాలా దినుసులు చక్కగా వేగిన తర్వాత, కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను అందులో వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, సుమారు 45 నిమిషాల పాటు నేతిలోనే మటన్ ను ఓపికగా వేయించాలి. ఈ సమయంలో మటన్ తనలోని సహజసిద్ధమైన రసాలతో నేతిలో ఉడుకుతుంది.
-45 నిమిషాల తర్వాత, దంచిన పచ్చిమిర్చి, అల్లం పొడి లేదా దంచిన అల్లం వేసి మళ్లీ వేయించడం కొనసాగించాలి.
-మటన్ ముక్కలు పూర్తిగా మెత్తబడి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా తయారయ్యే వరకు నెమ్మదిగా వేయించాలి. మాంసం చక్కగా ఉడికింది అనిపించాక, చివరగా మీ రుచికి తగినట్లుగా ఉప్పును జోడించండి. ఉప్పు వేసిన తర్వాత మటన్ ముక్కలకు పట్టేలా మరో ఐదు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆపేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే డియోఘర్ స్పెషల్ అత్తే మటన్ రెడీ. వేడివేడి అన్నం, రోటీ లేదా నాన్ తో దీనిని వడ్డిస్తే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications