కాకినాడ స్పెషల్ పీతల పిడుపు

కావలసిన పదార్థములు:

పీతలు: 6
అల్లం- 10 గ్రా
వెల్లుల్లి- 6 రెబ్బలు
ఉల్లిపాయలు- 2
పచ్చిమిరప- 4
కారం- 2 tsp
గరం మసాలా- 1 1/2 tsp
ఉప్పు- రుచికి సరిపడా
కొత్తిమిర- 1/2 కట్ట
కరివేపాకు- రెండు రెబ్బలు
నూనె- 100గ్రాములు
పసుపు- చిటికెడు

తయారు చేయు విధానం:

మొదట పీతలను వేడి నీటిలో 10 నిమిషాలు ఉడికించి పైన ఉన్న పొట్టు(డొల్ల)ను తొలగించి పిడుపును మాత్రం తీసి పక్కన పెట్టుకొవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరప, కొత్తిమిర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి, అల్లం గ్రైడ్ చేసి పేస్టును తయారు చేసి పెట్టుకొని స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత కట్ చేసి ఉంచుకొన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు అందులో వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా సన్నని మంట మీద వేపాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, కరివేపాకు, నూనె, పీతలు, కారం, ఉప్పు వేసి కావాలనుకుంటే మరికొద్దిగా నూనెను జత చేసి కొద్దిగా నీరు పోసుకోవచ్చు. ఈ మిశ్రమాన్నంతా స్పూన్ తో కలియ బెడుతూ 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా తయారైన పీతల పిడుపు గుజ్జుకు కొత్తిమిర చల్లి వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ పీతల పిడుపును చెపాతీలకి మంచి కాంబినేషన్. మరి మీరు ట్రై చేసి చూడండి.

Story first published: Saturday, October 10, 2009, 12:17 [IST]
Desktop Bottom Promotion