Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ప్రోటీన్ పవర్: రాగి పెసళ్ల దోశ ఇలా చేస్తే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం!
మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి రాగులు ఒక పెద్ద వరం. రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోలెడు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు తరచూ చెబుతుంటారు. అలాంటి శక్తివంతమైన రాగులతో, హై ప్రొటీన్ ఉండే పెసళ్లతో కమ్మనైన దోశ చేస్తే అదిరిపోతుంది.
రాగి పెసళ్ల దోశ అనేది కేవలం ఒక వంటకం కాదు, అది ఒక సంపూర్ణ పోషకాహారం. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ దోశను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల మీ కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అటు రాగుల శక్తి, ఇటు పెసళ్ల ప్రోటీన్ కలిసి మీ శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. సాధారణ బియ్యం దోశ లేదా మినప దోశ కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రాగి పెసళ్ల దోశ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

రాగి పెసళ్ల దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగులు
-తెల్ల మినపప్పు
-బియ్యం
-పెసళ్లు
-మెంతులు
-క్యారెట్ తురుము
-ఉల్లిపాయ తరుగు
రాగి పెసళ్ల దోశ తయారీ విధానం
-ముందులో ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఇందులో 1 కప్పు రాగులు, 1 కప్పు పెసళ్లు, అర కప్పు తెల్ల మినపప్పు, 2 స్పూన్ల బియ్యం, 1 స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడిగాక నీళ్లు పోసి 8-10 గంటలు నానబెట్టుకోవాలి.
-తర్వాత నీటిని వంపేసి మిశ్రమం మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
-రుబ్బుకున్న పిండిని ఓ గిన్నెలో వేసి స్పూన్ తో ఒకసారి కలుపుకున్నాక మూతపెట్టేసి 6-7 గంటలు వదిలేయాలి.
-తర్వాత మూత తీస్తే పిండి బాగా పులిసి ఉంటుంది. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలపాలి.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి వేడి చెయ్యాలి.
-వేడెక్కిన పెనం మీద గరిటెడు పిండితో దోశ పోసుకోండి. దోశ మీద క్యారెట్ తురుము, ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకోండి. దీంతో రుచి మరింత పెరుగుతుంది. దోశ బాగా కాలిన తర్వాత ఓ ప్లేట్ లోకి తీసుకోండి. దోస రెండు వైపులా తిప్పి కాల్చుకోనక్కర్లేదు, ఒకవైపు కాల్చితే సరిపోతుంది.
-అంతే హెల్దీ రాగి పెసళ్ల దోశ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications