Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రాగి పూరీ-ఉల్లిపాయ మసాలా..లెక్కలేకుండా తినేయడం గ్యారెంటీ!
మనం ఎప్పుడూ ఒకే రకమైన గోధుమ పిండి లేదా మైదాతోనే పూరీలు చేస్తుంటాం. దానికి బదులుగా ఈసారి కాస్త భిన్నంగా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితో పూరీలు తయారు చేసి చూడండి. ఈ రాగి పూరీ అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా, శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది.
ముఖ్యంగా మండుతున్న వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి రోజువారీ ఆహారంలో రాగిని చేర్చుకోవడం చాలా మంచిది. ఇక ఈ వేడి వేడి రాగి పూరీకి కమ్మటి ఉల్లిపాయ మసాలా (బాంబే చట్నీ) తోడైతే ఆ రుచే వేరు. రాగి పూరీ, ఉల్లిపాయ మసాలాను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

రాగి పూరీ, ఉల్లిపాయ మసాలా తయారీకి కావాల్సినవి
రాగి పిండి - 1 కప్పు
గోధుమ పిండి - 1 కప్పు
ఉప్పు -తగినంత
నీరు - పిండి కలపడానికి
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
ఉల్లిపాయ మసాలాకి నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినపపప్పు - 1 టీస్పూన్
వేరుశెనగ గుళ్లు - 2 టీస్పూన్లు
సోంపు - ముప్పావు టీస్పూన్
ఉల్లిపాయలు - 3
కరివేపాకు - 1 రెమ్మ
పచ్చిమిర్చి - 4
టమాటో - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
శనగపిండి - 2 టీస్పూన్లు
నీరు - 2 కప్పులు
కొత్తిమీర - కొద్దిగా
రాగి పూరీ, ఉల్లిపాయ మసాలా తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిని సాధారణ చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి.
-కలుపుకున్న పిండి ఆరిపోకుండా దానిపై ఒక టీస్పూన్ నూనె రాసి, మూతపెట్టి సుమారు 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
-పిండి నానేలోపు ఉల్లిపాయ మసాలా కర్రీని రెడీ చేసుకోండి. ఇందుకోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి.
-నూనె వేడెక్కాక ఆవాలు, మినపపప్పు, వేరుశెనగ గుళ్లు వేసి దోరగా, బంగారు వర్ణంలోకి వచ్చేలా వేయించాక అందులో సోంపు (లేదా జీలకర్ర), కరివేపాకు వేసి చిటపటలాడాక..పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
-ఉల్లిపాయలు మొత్తబడ్డాక అందులో తరిగిన టమాటో ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి టమాటాలు గుజ్జులా అయ్యేదాకా మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించి, గరం మసాలా కూడా వేసి బాగా కలిపి 2 కప్పుల నీళ్లు పోసి, మూత పెట్టి ఒక 5 నుండి 8 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి.
-అది ఉడికేలోపు ఒక చిన్న గిన్నెలో 2 టీస్పూన్ల శనగపిండి తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న కూరలో పోసి మరో 5 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి.
-మసాలా కాస్త చిక్కబడి, కమ్మటి వాసన వస్తున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ మసాలా రెడీ.

రాగి పూరీలు వేయించే విధానం
-ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పిండిని మరోసారి బాగా పిసికి, చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
-చపాతీ కర్రతో వాటిని మరీ పల్చగా కాకుండా, కొద్దిగా మందంగా పూరీల్లా ఒత్తుకోవాలి.
-స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కాక, ఒత్తి పెట్టుకున్న పూరీలను అందులో వేయాలి. గరిటతో పైన కొద్దిగా ఒత్తితే పూరీలు బంతిలా పొంగుతాయి. రెండు వైపులా చక్కగా కాల్చుకుని బయటకు రాగి పూరీ రెడీ. దీనిని వేడి వేడిగా ఉల్లిపాయ మసాలాతో అద్దుకుని తింటుంటే ఆ మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications