Latest Updates
-
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.!
sabarimala prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం..ఇంట్లో ఈజీగా ఇలా చేసుకోండి
మనకు తెలిసినవాళ్లు లేదా మన బంధువులు లేదా ఇంట్లోవాళ్లు శబరిమల వెళ్తే ఖచ్చితంగా శబరిమల ప్రసాదం(sabarimala ayyappa prasadam) తెచ్చి ఇవ్వండి అని అడుగుతుంటాం. వాళ్లు ఎప్పుడు శబరిమల నుంచి వస్తారు ప్రసాదం ఎప్పుడు తెస్తారు అని ఎదురుచూస్తుంటాం. శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం అరవణకి(aravana) ఉన్న క్రేజ్ అలాంటిది మరి. అయితే శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని అంతే రుచిగా ఉండేలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయ్యప్పస్వామి ప్రసాదం తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
శబరిమల అయ్యప్ప ప్రసాదం తయారీకి కావల్సిన
పదార్థాలు
-తాటి బెల్లం
-రెడ్ రైస్
-శొంటి పొడి
-ఆవు నెయ్యి
-నల్ల ఎండు ద్రాక్ష
-ఎండు కొబ్బరి ముక్కలు
-పచ్చి కర్పూరం
-యాలకుల పొడి

శబరిమల అయ్యప్ప ప్రసాదం తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక కప్పు ఎర్ర బియ్యాన్ని(రెడ్
రైస్) పోసి శుభ్రంగా కడగి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెడ్ రైస్ వేసి 5 నిమిషాల పాటు దోరగా వచ్చేదాకా వేయించండి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి.
-ఇప్పుడు రైస్ కొలిచి తీసుకున్న అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు అందులో పోయండి.
-మధ్య మధ్యలో రైస్ కలుపుతూ ఉండండి. మరీ మెత్తగా అన్నం ఉడికించినంత సాఫ్ట్ గా కాకుండా లైట్ పలుకుగా ఉండాలి..చేతితో నొక్కితే మెత్తగా ఉండేలా ఉడికించి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు ఇప్పడు స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో ముప్పావు కప్పు నీళ్లు పోసి అందులో 3 కప్పుల సన్నగా తరిగిన తాటి బెల్లం వేయండి.
-మంటను మీడియం ప్లేమ్ మీద పెట్టి కలుపుతూ బెల్లాన్ని కరగబెట్టండి.
-బెల్లం పూర్తిగా కరిగితే చాలు పాకం రానవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు ఉడికిన బియ్యంలో బెల్లం నీళ్లు ఫిల్టర్ చేసి కలుపుకోండి. మంటను మీడియం ప్లేమ్ మీద పెట్టుకోండి. గరిటతో తిప్పుతూ కాస్త చిక్కబడనివ్వండి.
-ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల నల్ల ఎండు ద్రాక్ష వేయండి. అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా ఆవు నెయ్యి వేస్తూ ఉడికించాలి. మెత్తంగా నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వాడితే చాలు.
-20 నిమిషాల పాటు ఉడికిన తర్వాత అది కాస్త చిక్కబడుతుంది. అప్పుడు అందులో 1 టీ స్పూన్ శొంటి పొడి, 1 టీ స్పూన్ యాలకల పొడి,చిటికెడంత పచ్చి కర్పూరం వేసి బాగా కలుపుకోండి.
-15 నిమిషాల పాటు మీడియం ప్లేమ్ మీద ఉడికించుకోండి. చితి వేళ్ల మధ్య పెడితే చిక్కటి తీగ పాకంలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసి కడాయిని పక్కకు తీసి ఉంచండి. చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొన్ని రోజుల పాటు తినవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications