Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మఖాన కీర్: నవరాత్రి స్పెషల్ స్వీట్
వసంత నవరాత్రి ఉపవాసాలు ప్రారంభమైనాయి. నవరాత్రి స్పెషల్ ఉపవాస పలహారలు, స్వీట్స్, తయారుచేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. . ఇవి తినడానికి టేస్టీగా హెల్తీ మరియు కడుపు నింపేవిగా ఉంటాయి. ఖీర్ అనేది మన ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటి స్వీట్ డిష్. ముఖ్యంగా పండుగ సందర్భంగా వీటిని తయారు చేసుకుంటారు.
ఖీర్ తయారుచేయడానికి వివిధ మార్గాలున్నాయి. సాధారణంగా ఎక్కువగా తయారుచేసుకొనే ఖీర్ రైస్ కీర్ . అయితే వ్రతాల సమయంలో బియ్యంతో తయారుచేసిన ఖీర్ లను తీసుకోకూడదు. కాబట్టి, ఇక్కడ ఒక స్పెషల్ కీర్ మీకు పరిచయం చేయడం జరిగింది. దీన్ని నవరాత్రి వ్రత సందర్బంగా తయారుచేసుకోండి...

కావల్సిన పదార్థాలు:
లోఫ్యాట్ మిల్క్: 3cups
మఖాన: 1cup
షుగర్: 11/2cup
నట్ మగ్ పౌడర్: చిటికెడు
బదాం: 5-6
జీడిపప్పు: 5-6(మద్యలోకి కట్ చేసుకోవాలి)
కుంకుమపువ్వు: కొద్దిగా
నెయ్యి: 1tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత అందులో మఖాన వేసి 3-4నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
2. తర్వాత వాటిని ఒక ప్లేట్ లోనికి తీసుకోవాలి. అంతలోపు, పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోవాలి.
3. ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా పాలు పోసి బాగా కాచాలి. పాలు చిక్కబడే వరకూ మరిగించాలి.
4. ఇప్పుడు ఆ మరిగే పాలలో వేయించుకొన్న మఖానా(చీజ్ లేదా పనీర్ వంటిది)వేసి మంటను సిమ్ లో పెట్టి 5నిముషాలు ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు అందులో పంచదార వేసి బాగా కలుపుకోవాలి . పంచదార కరిగే వరకూ ఉడకించుకోవాలి. తర్వాత అందులో కుంకుమ పువ్వు నానబెట్టుకొన్న పాలను పోసి బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి.
6. ఒక సారి ఉడికించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత అందులో బాదం, జీడిపప్పు, నట్ మగ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











