మిక్డ్స్ పూరీ మసాలా...

Mixed Poori Masala...
కావలసిన పదార్థాలు:
మామిడికాయ ముక్కలు: 1/2cup(సన్నగా తరిగినవి)
గోధుమ పిండి: 3cups
కొత్తిమీర పేస్ట్: 1/2cup
పుదీనా పేస్ట్: 1/2cup
పచ్చిమిర్చిముక్కలు: 1/2cup
ఉల్లిపాయ పేస్ట్: 1/2cup
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడ
గరం మసాలా: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
పెరుగు: 1/2cup
నూనె: తగినంత
ఛాట్ మసాలా: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా ఓ గిన్నెలో గోధుమ పిండిలో సరిపడ నీళ్లు పోసి పెరుగు, ఉప్పు వేసి కలపాలి.
2. తర్వాత కొద్దిసేపటి తర్వాత మిగిలిన ఉల్లి, పచ్చిమిర్చి తదితర పేస్ట్‌ లను మరియూ మసాలాపొడులన్నీవేసి బాగా కలపాలి.
3. దీనిపై తడిబట్ట వేసి అరగంటపాటు అలానే ఉంచాలి. తర్వాత పిండిని తీసి చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల ఆకారంలో గుండ్రంగా ఒత్తుకోవాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి కాగాక ఇందులో పూరీలను వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి తీయాలి.
5. అంతే మిక్డ్స్ మసాలా పూరీలు రెడీ.. వీటిని పెరుగు తట్నీతో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటాయి.

Story first published: Friday, March 16, 2012, 13:29 [IST]
Desktop Bottom Promotion