శ్రావణ మాసం స్పెషల్‌.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.!

శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి విశేష పూజలు, వ్రతాలు చేయడంతో పాటు ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖ్యంగా బెల్లంతో చేసే ప్రసాదాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. ఇంకా పెసరపప్పుతో చేసే స్పెషల్స్‌ తప్పనిసరిగా నైవేద్యాల్లో ఉండాల్సిందే.. ఈ సారి పెసరపప్పు, బెల్లంతో ఈ పాయసం చేసి చూడండి.. అది కూడా పాలు లేకుండానే ఎంతో అద్భుతమైన రుచితో. ఈ పద్ధతిలో చేశారంటే పెసరప్పపు పాయసం ఎంతసేపయినా గట్టిపడదు..

Sravana masam special pesarapappu kobbari and bellam payasam for naivedyam in telugu

పెసరపప్పు పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు

పెసరపప్పు- కప్పు
నీళ్లు- రెండున్నర కప్పులు
బెల్లం- రెండు కప్పులు
తాజా కొబ్బరి- ఒకటి
ఏలకుల పొడి- అర టీస్పూన్‌
జీలకర్ర పొడి- అర టీస్పూన్‌
నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు
జీడిపప్పు పలుకులు- మూడు టేబుల్‌ స్పూన్లు
పచ్చి కొబ్బరి ముక్కలు- పావు కప్పు
ఎండు ద్రాక్ష- టేబుల్‌ స్పూన్‌

ముందుగా పెసరపప్పును రంగు మారేవరకు బాగా రోస్ట్‌ చేసుకోవాలి. అందులో నుంచి సగం తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా సగాన్ని ఇంకాస్త రోస్ట్‌ చేసి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

మహిళల్లో పీరియడ్స్‌, ఫిట్‌నెస్‌ సమస్యలకు చెక్‌ పెట్టే ప్రొటీన్‌ పౌడర్‌.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి

ఇప్పుడు రోస్ట్‌ చేసిన పెసరపప్పును రెండు సార్లు కడిగి కుక్కర్‌లోకి తీసుకోవాలి. రెండున్నర కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

ఈలోపు స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని అందులో బెల్లం వేసి పావు కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లం కరిగాక కాసేపు మరగనివ్వాలి.

Sravana masam special pesarapappu kobbari and bellam payasam for naivedyam in telugu

ఇప్పుడు పచ్చి కొబ్బరికాయను ముక్కలను కట్‌ చేసి పావు కప్పును పక్కన పెట్టుకోవాలి. మిగతా ముక్కలను మిక్సీ బౌల్‌లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి కొబ్బరి పాలను వడబోసి పక్కన పెట్టుకోవాలి.

కుక్కర్‌ మూత తీసి ఉడికిన పెసరపప్పులో కొంచెం చిక్కగా మరిగిన బెల్లం పానకం వేసి కలపాలి. కాసేపటి తర్వాత సగం కొబ్బరి పాలను పోసి పావు గంటసేపు ఉడికించాలి.

ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్‌ కాంబినేషన్‌ ఆలూ టమాటర్‌ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.!

పాయసం అడుగంటకుడా ఉండేందుకు పదే పదే గరిటెతో కలియతిప్పాలి. ఇప్పుడు అందులో ఏలకుల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి ఉడకనివ్వాలి. పాయసం చిక్కగా అయినప్పుడు మిగిలిన కొబ్బరి పాలు వేసి కాసేపు మరిగించి పక్కన పెట్టాలి.

ఇప్పుడు స్టవ్‌పైన చిన్న తాలింపు పాన్‌ పెట్టుకుని అందులో నెయ్యి వేసి కరగనివ్వాలి. అందులో జీడిపప్పు పలుకులు, పచ్చికొబ్బరి ముక్కలు, కిస్‌మిస్‌ వేసి దోరగా వేయించాలి.

దీనిని పాయసంలో వేసి కలిపి గార్నిష్‌ చేసుకోవాలి. ఈ పాయసం మరీ చిక్కగా మరీ పలుచగా లేకుండా చూసుకోవాలి. లేదంటే దాని టేస్ట్‌ మారిపోతుంది.

ఈ పాయసం తాగేటప్పుడు పెసరపప్పు పలుకులు నోటికి క్రిస్పీగా తగులుతూ పాలతో చేసే పాయసాన్ని మించిన రుచితో అమోఘంగా ఉంటుంది. వచ్చే పండుగల్లో తప్పనిసరిగా ట్రై చేయాల్సిన స్వీట్‌ రెసిపీ ఇది.

[ of 5 - Users]
Story first published: Friday, August 21, 2026, 15:53 [IST]
q
Desktop Bottom Promotion