Latest Updates
-
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా..
శ్రీరామనవమి స్పెషల్.. కేవలం 5 నిమిషాల్లో రాముడికి ఇష్టమైన పంచామృతం..ఎలా చేసుకోవాలంటే..
చైత్ర శుద్ధ నవమి అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది సీతారాముల కల్యాణం, శ్రీరాముని జన్మదినం. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా రామనవమి పండుగను భక్తులు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా బాల రాముడు కొలువైన అయోధ్య నగరంలో నెలకొన్న ఉత్సాహం, పండుగ వాతావరణం కన్నుల పండువగా చూడముచ్చటగా ఉంటుంది.
శ్రీరామనవమి రోజున రాముడికి సమర్పించే అత్యంత ప్రధానమైన నైవేద్యం పంచామృతం. పంచామృతం అనగా అక్షరాలా ఐదు అమృతాల కలయిక. హిందూ పౌరాణిక గ్రంథాల ప్రకారం ఇందులో ఉపయోగించే ఐదు పదార్థాలు మానవ జీవితంలోని ఐదు విశిష్టమైన గుణాలకు ప్రతీకలుగా నిలుస్తాయి.

ఐదు అద్భుత మూలకాల కలయికతో తయారైన పంచామృతాన్ని దేవునికి భక్తితో నైవేద్యంగా సమర్పించడం వల్ల దేవతలు ప్రీతి చెందుతారు. అలాగే, ఈ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించడం ద్వారా వారిలో పాజిటివ్ ఎనర్జీ వృద్ధి చెంది, జీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని ప్రగాఢ విశ్వాసం. కేవలం ఐదు నిమిషాల్లో ఎంతో సులభంగా పంచామృతాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
పంచామృతం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
పచ్చి ఆవు పాలు: 1 కప్పు
పెరుగు: అర కప్పు
స్వచ్ఛమైన తేనె: 1 టేబుల్ స్పూన్
ఆవు నెయ్యి: 1 టీస్పూన్
పంచదార లేదా పటిక బెల్లం: 2 టేబుల్ స్పూన్లు
తులసి ఆకులు: 5 నుంచి 7 వరకు
డ్రై ఫ్రూట్స్,మఖానా: తగినంత
పంచామృతం తయారీ విధానం
-పంచామృతం తయారీలో భక్తి, శుచి చాలా అవసరం. ముందుగా ఒక శుభ్రమైన పాత్రను తీసుకోండి. అందులో తాజా పెరుగు వేసి ఉండలు లేకుండా గరిటెతో తేలికగా చిలకాలి. ఆ తర్వాత అందులో పచ్చి ఆవు పాలు పోసి కలపాలి. ఇప్పుడు వరుసగా తేనె, పంచదార, స్వచ్ఛమైన నెయ్యి వేసి అన్నీ పాలల్లో బాగా కరిగేలా మిశ్రమాన్ని కలుపుకోవాలి. మరింత రుచి కోసం సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, మఖానా ఇందులో కలుపుకోవచ్చు.
-ఇందులో అత్యంత ముఖ్యమైన ఘట్టం.. పవిత్రమైన తులసి ఆకులను వేయడం. హిందూ సంప్రదాయం ప్రకారం తులసి దళాలు లేని ఏ నైవేద్యాన్నీ శ్రీ మహావిష్ణువు స్వీకరించడు. శ్రీరాముడు సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి అవతారమే కాబట్టి ఈ పంచామృతంలో తులసి ఆకులను తప్పనిసరిగా వేయాలి.
-అంతే దేవుడికి సమర్పించడానికి మధురమైన పంచామృతం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications