Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
ఘుమఘుమలాడే గరం మసాలా..ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
భారతీయ వంటగదిలో మసాలా దినుసులకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మన వంటకాల రుచి, సువాసన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం మనం వాడే ఈ మసాలాలే. వీటిలో గరం మసాలా రారాజు అని చెప్పవచ్చు. గరం అంటే వేడి అని, మసాలా అంటే దినుసుల మిశ్రమం అని అర్థం.
ఆయుర్వేదం ప్రకారం ఈ మసాలా శరీరంలో వేడిని పుట్టించి, జీవక్రియను మెరుగుపరుస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. మార్కెట్లో దొరికే ప్యాకెట్ మసాలాల కంటే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా తాజాదనంతో పాటు ఎక్కువ ఆరోగ్యాన్ని, రుచిని ఇస్తుంది. ఇంట్లోనే గరం మసాలా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
ధనియాలు: అర కప్పు (50 గ్రా)
జీలకర్ర: పావు కప్పు
యాలకులు: 25
నల్ల యాలకులు: 5
లవంగాలు: 1 టేబుల్ స్పూన్
మిరియాలు: 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క: 3 అంగుళాల ముక్కలు 4-5
బిర్యానీ ఆకులు: 4-5
అనాస పువ్వు: 2
జాజికాయ: చిన్న ముక్క
జాపత్రి: 2-3 రేకలు
సోంపు: 1 టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా మసాలా దినుసులన్నింటినీ శుభ్రం చేసుకోవాలి. రాళ్లు, మట్టి లేకుండా చూసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి బాండీ పెట్టి మంటను చాలా తక్కువలో ఉంచాలి. ముందుగా ధనియాలను వేసి 1-2 నిమిషాలు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత దాల్చిన చెక్క, నల్ల యాలకులు, అనాస పువ్వు, మిరియాలు, లవంగాలు వేసి వేయించాలి.
-చివరగా త్వరగా వేగిపోయే జీలకర్ర, పచ్చ యాలకులు, జాపత్రి, బిర్యానీ ఆకులను వేసి, సువాసన వచ్చే వరకు సుమారు 1 నిమిషం వేయించాలి. దినుసులను మాడనివ్వకూడదు. మాడితే మసాలా చేదుగా మారుతుంది. కేవలం వాటిలోని తేమ పోయి, నూనెలు బయటకు వచ్చేలా వేడెక్కితే చాలు.
-జాజికాయను వేయించాల్సిన అవసరం లేదు, దాన్ని చిన్న ముక్కలుగా చేసి నేరుగా గ్రైండర్ లో వేయవచ్చు.
-వేయించిన దినుసులన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన దినుసులను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఆపి స్పూన్ తో కలుపుతూ గ్రైండ్ చేస్తే పొడి మెత్తగా వస్తుంది.
-మీకు బాగా మెత్తని పొడి కావాలంటే జల్లెడ పట్టవచ్చు. కాస్త బరకగా ఉంటేనే కూరల్లో రుచి బాగుంటుంది అనిపిస్తే అలాగే ఉంచేయొచ్చు.
-తయారైన గరం మసాలాను గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. తడి తగలనివ్వకూడదు. ఇలా చేస్తే 3 నుండి 6 నెలల వరకు సువాసన పోకుండా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
