Latest Updates
-
హై బీపీ కంటే లో బీపీనే డేంజర్? ఇంట్లోనే రక్తపోటును నార్మల్ చేసే 5 హోమ్ రెమెడీస్! -
ఆఫీసు కుర్చీలతో ఆరోగ్య సమస్యలు.. గుండెతో పాటు వీటికి ఎనలేని రిస్క్.! -
ఇంట్లో కూరగాయలు లేవా? 2 ఉల్లిపాయలతో సూపర్ టేస్టీ పరాఠాలు..బ్రేక్ ఫాస్ట్, లంచ్ బాక్సుల్లోకి పర్ఫెక్ట్ -
గల్లీలో పుట్టి.. నేడు రూ.75 వేల కోట్ల సామ్రాజ్యంగా..ఇది చిన్న యవ్వారం కాదుగా! -
పప్పు అంటే ముఖం తిప్పుకునే వారు కూడా.. లొట్టలేసుకుని తినే షాహీ మొఘలాయ్ పెసరపప్పు -
40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి! -
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్
నోటికి రుచి, ఒంటికి బలం..రాగి మునగాకు కుడుములు ఎప్పుడైనా తిన్నారా?
ఉరుకుల పరుగుల జీవితంలో రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండే రాగి, విటమిన్లకు కేరాఫ్ అడ్రస్ అయిన మునగాకు కలిపి చేసే వంటకం అంటే.. అది కచ్చితంగా సూపర్ ఫుడ్ అనాల్సిందే. అదే రాగి మునగాకు కుడుములు. నోటికి రుచిగా, ఆరోగ్యానికి అద్భుతంగా అనిపించే రాగి మునగాకు కుడుములు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

రాగి మునగాకు కుడుములు తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి - 1 కప్పు (2-3 నిమిషాలు దోరగా వేయించుకోవాలి)
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
నువ్వుల నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
ఎండుమిర్చి - 2
పచ్చిమిర్చి - 1
అల్లం - అర అంగుళం ముక్క
ఇంగువ - చిటికెడు
ఉల్లిపాయ - 1
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు - 2 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
మునగాకు - అర కప్పు
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
రాగి మునగాకు కుడుములు తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, మంటను సిమ్ లో ఉంచి రాగి పిండిని 2 లేదా 3 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో బియ్యం పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి.
-ఒక పాన్ లో నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు వేసి చిటపటలాడాక.. మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, చిటికెడు ఇంగువ వేసి కాస్త వేగనివ్వాలి. అందులోనే తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. ఉల్లిపాయలు మగ్గాక, పచ్చి కొబ్బరి తురుము వేసి మరో 30 సెకన్ల పాటు వేయించాలి. ఈ మిశ్రమంలో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి.
-నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు, మునగాకును అందులో వేసి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి.
-వేడిగా ఉన్న నీటి మిశ్రమంలో వెంటనే మనం పక్కన పెట్టుకున్న రాగి, బియ్యం పిండి మిశ్రమాన్ని వేయాలి. అలాగే కొత్తిమీర కూడా చల్లి, పిండి ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలపాలి. పిండి మరీ గట్టిగా అనిపిస్తే అవసరాన్ని బట్టి మరో అర కప్పు వేడి నీళ్లు కలుపుకోవచ్చు. పిండి పగుళ్లు లేకుండా మెత్తని ముద్దలా అవ్వాలి.
-పిండి కాస్త చల్లారాక, చేతులకి కొద్దిగా నూనె రాసుకుని ఆ పిండిని చిన్న చిన్న కుడుములు ఆకారంలో లేదా రౌండ్ బాల్స్ లా చేసుకోవాలి. వీటిని ఇడ్లీ పాత్రలో లేదా స్టీమర్ లో పెట్టి, మీడియం మంట మీద 8 నుంచి 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి.
-అంతే ఎంతో రుచికరమైన రాగి మునగాకు కుడుములు రెడీ. వేడివేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీతో గానీ, కారపు పచ్చడితో గానీ తింటే అద్భుతంగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications