Latest Updates
-
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రతి చిన్న సమస్యకి మందులు వాడటం ఎంత ప్రమాదమో తెలుసా.? -
పెళ్లిళ్ల స్పెషల్.. హైడ్రా పాత్ షాహి రెడ్ చికెన్.. బ్యాచ్లర్స్ సైతం సింపుల్గా చేసుకునేలా.! -
అమర్నాథ్ యాత్రికులకు అలర్ట్.. బడ్జెట్ ఎక్కడ, ఎంతవుతుంది.. పూర్తి వివరాలు.! -
చర్మ సౌందర్యాన్ని ఇట్టే పెంచే పాలకూర.. దాబా స్టైల్లో నోరూరించేలా ఇలా చేయండి.! -
ఇంట్లోకి మురికి రాకుండా చేసే 5 బెస్ట్ డోర్ మ్యాట్లు.. వర్షాకాలంలో బెస్ట్ ఆప్షన్స్.! -
గుండెకి మేలు, ఎముకలకి బలం.. ఇంకా ఎన్నో.. రోజూ మెట్లు ఎక్కితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.! -
మహిళలు, పిల్లల ఎముకల బలానికి అమృతం లాంటి నల్ల మినపపప్పు చట్నీ..ఇడ్లీ,దోశెలతో సూపర్ టేస్ట్ -
హిందూ ధర్మంలో ‘లోక కల్యాణం’ అనే భావన ఎందుకు అంత గొప్పది? -
ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటాం? కళ్ళు తెరిచి ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది? -
వంట రాని వారు కూడా చిటికెలో చేసే సూపర్ టేస్టీ స్నాక్.. ఆలూ కట్లీ చేసుకోండిలా..
మరో మహిళా నక్షత్రం ‘అరుంధతి రాయ్’!

బాల్యమంతా కేరళలోని అయమానం లో గడిచింది.తమిళనాడు లోని నీలగిరిలో వున్న లవ్ డేల్ లారెన్స్ స్కూలులో ప్రాధమిక విద్యాభ్యాసం చేసింది. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో ఆర్కిటెక్చర్ చేసింది. ఇక్కడే తన మొదటి భర్త గెరార్డ్ డా కున్హాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. రాయ్ రెండవ భర్త పేరొందిన సినీ నిర్మాత ప్రదీప్ క్రిషన్. అతని అవార్గు పొందిన చిత్రంలో ఆమె నటించింది. ఆమె టెలివిజన్ లో పనిచేస్తూనే కొన్ని సినిమాలలో కూడా నటించింది. 1994 లో ఫూలన్ దేవి నటించిన శేఖర్ కపూర్ చిత్రం బండిట్ క్వీన్ ను విమర్శించడంతో ఆమె వార్తల కెక్కింది. ఆమె మొదటి నవల గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్ 1992 లో మొదలుపెట్టబడి 1996లో పూర్తయింది. ఇందులో చాలా భాగం ఆమె బాల్య జీవితం ప్రతిబింబిస్తుంది.
ఆమె వ్రాసిన ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్ ఆమెకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. దానికి 1997 బుకర్ ప్రైజ్ వచి్చింది. ఈ పుస్తకం వాణిజ్య పరంగా కూడా బాగా అమ్ముడుపోయింది. ప్రచురణకు ముందు అడ్వాన్సుగా ఆమె సుమారు అర్ధ మిలియన్ పౌండ్లు పొందింది. సుమారు 18 దేశాలలో ఈమె పుస్తకం అమ్మకం జరిగింది. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలకుగాను ఆమె తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఆమె పుస్తకం విజయవంతం కావడంతో తర్వాతి రోజులలో ఆమె టి.వి. రచయితగా రచనలు మొదలుపెట్టింది. అరుంధతి రాయ్, వుయ్ ఆర్ ఒన్, సెలిబ్రేషన్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ మొదలైన సమాజపర అంశాలతో మంచి రచనలు చేసి ఖ్యాతి గడించింది.
అరుంధతి రాయ్ మేధా పట్కర్ తో కలసి నర్మదా బచావ్ ఆందోళనలో పాల్గొంది. తనకు వచ్చిన బుకర్ ప్రైజ్ మనీ, ఇతర రాయల్టీలను నర్మదా బచావ్ ఆందోళన వ్యయంగా ఖర్చు చేసింది.



Click it and Unblock the Notifications