ప్రియుడితో శృంగారం చేస్తున్న భార్యను సడెన్ గా చూసిన భర్త..ఆమె చేసిన పనికి మైండ్ బ్లాక్

కామంతో కళ్లు మూసుకుపోయి ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు కొంతమందికి. ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు భారీగా పెరగడమే కాకుండా వీటి వల్ల కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనమయ్యే పరిస్థితి వచ్చేసింది. తాజాగా ఓ మహిళ ఏకంగా తన ఇంట్లోనే భర్త పక్కన ఉండగానే ప్రియుడితో కులకడం మొదలుపెట్టింది. అయితే సడెన్ గా తన పెళ్లాం చాటు మాటు వ్యవహారాన్ని భర్త చూశాడు. దీంతో మహిళ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. ఇలా ఉన్నారేంటే బాబు అంటూ నెటిజన్లు ఈ సంఘటనను తెలుసుకొని అవాక్కవుతున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్ గంజ్ లో నివసించే ఓ మహిళ తన భర్తకు తెలియకుండా చాన్నాళ్లుగా అదే ఊర్లో నివసించే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే సోమవారం రాత్రి గదిలో వేడిగా ఉండటంతో భర్త మిద్దె మీదకు వెళ్లి పడుకున్నాడు. ఇదే మంచి అవకాశం అని భావించిన భార్య ప్రియుడిని ఇంటికి పిలిచింది. ప్రియుడితో డీప్ రొమాన్స్ లో ఉండగా.. ఏదో శబ్దం వచ్చినట్లు వినిపించడంతో భర్త పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లి చూడగా..తన భార్య మరో వ్యక్తితో శృంగారంలో చేస్తుండటం చూసి షాక్ అయ్యాడు. ఆయన గుండె ఒక్కసారిగా జారిపోయింది. తన భార్య మరో వ్యక్తితో అభ్యంతరకరమైన స్థితిలో చూసిన భర్త బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. ఆ శబ్దాలకి ఇంట్లోని కుటుంబ సభ్యులు,పొరుగింటోళ్లు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు.

Husband caught wife with her boyfriend in own house in uttarpradesh

మహిళతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లారు. మహిళ భర్త తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అసలు జరిగిన విషయం మొత్తం పోలీసులు తెలుసుకున్నారు. దీనిపై పోలీసులు మహిళని ప్రశ్నించినప్పుడు తాను తన ప్రియుడితోనే కలిసి జీవించాలనుకుంటున్నానని..తన భర్తతో ఉండటం ఇష్టం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆమె భర్త జోక్యం చేసుకొని ఆమె ఎవరితోనైనా ఉండొచ్చని, తనతో ఉండాలని ఆమెను బలవంతపెట్టనని..తమ ముగ్గురు పిల్లలను కూడా తానే సాకుతానని, కానీ వారి బాల్యం తల్లి ప్రేమ లేకుండా అసంపూర్ణంగా ఉంటుందని చెప్పాడు.

తాను మరో వ్యక్తితో వెళ్లిపోతున్నా అని ఆ మహిళ తన 4,6,8 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలతో చెప్పినప్పుడు..అమ్మా వెళ్లొద్దు అంటూ వాళ్లు ఏడ్చారు. అయితే ప్రియుడి మత్తులో ఉన్న ఆ మహిళ ఏడుస్తున్న పిల్లలపై దయ కూడా చూపలేదు. ఆమె హృదయం కరగలేదు. ప్రియుడే ముద్దు..భర్త,పిల్లలు వద్దంటే వద్దు అని తేల్చి చెప్పింది. చివరికి మహిళ,ఆమె ప్రేమికుడు ఇద్దరూ మేజర్స్ కావడం, ఇరు పార్టీల అంగీకారం తర్వాత మహిళ ఆమె ప్రియుడితో వెళ్లిపొయిందని స్థానిక ఎస్సీ సోమేంద్ర మీనా చెప్పారు.

Story first published: Saturday, May 24, 2025, 8:31 [IST]
Desktop Bottom Promotion