Latest Updates
-
కొత్తగా పెళ్లయిందా.. ఆ ఐదేళ్లు తప్పనిసరిగా కలిసే జీవించాలి.. లేదంటే.! -
కస్టమర్లకు అలర్ట్.. జులైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. వివరాలివే.! -
పిల్లలకి ఖచ్చితంగా పెట్టాల్సిన ఫూల్ మఖానాతో హెల్తీ దోశ.. లంచ్ బాక్స్లోకి ఇష్టంగా లాగించేస్తారు.! -
ఎముకల బలానికి, రక్తహీనతకి చెక్ పెట్టే హెల్తీ చాక్లెట్ లడ్డూ..రోజుకొకటి తింటే డాక్టర్ తో పనే ఉండదు! -
బ్రహ్మ యోగం ముగింపు.. ఇంద్ర యోగం ప్రారంభం: ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
మీ ముఖంపై వీటిని పొరపాటున కూడా పూయకండి.. లేదంటే మొటిమలతో చిరాకు తప్పదు.! -
వర్షాకాలంలో విహారయాత్ర.. మీ లగేజ్ బ్యాగ్లో ఈ ఐదు స్మార్ట్ గ్యాడ్జెట్స్ తప్పనిసరి.! -
కర్ణాటక ఫేమస్ తట్టే ఇడ్లీ..ఒక్కసారైనా తిని తీరాల్సిందే -
మకర రాశిలో చంద్రుడి సంచారం: ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం, ధన లాభం ఖాయం! -
దేవాలయాల్లో గోపురాలపై విగ్రహాలు ఎందుకు చెక్కబడ్డాయి?
ఒకే మహిళపై మనసు పారేసుకున్న తండ్రీ కొడుకులు... చివరికి ఏం జరిగిందంటే...
బీహార్ రాష్ట్రంలో ఒకే మహిళపై మనసు పారేసుకున్న తండ్రి కొడుకులు చివరకు ఏం చేశారో చూడండి...
మన దేశంలో బంధాలు, అనుబంధాలకు ఎంతో విలువ ఉంది. ఆప్యాయన, అనురాగాలకు మన భారతదేశాన్ని పుట్టినిల్లుగా ఎందరో విదేశీయులు ప్రశంసిస్తుంటారు. ఇంత పెద్ద దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా సాధ్యమా అని ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు.

అయితే ప్రస్తుతం మన దేశంలో కూడా వావి వరసలు మరిచిపోతున్నారు కొందరు ప్రబుద్ధులు. ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయంలో రోజురోజుకు చిత్ర విచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇటీవలే తెలంగాణలో వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి 9 మందిని హత్య చేసిన సంగతిని మరువకముందే... బీహార్ లో మరో దారుణం చోటు చేసుకుంది. అక్కడ ఓ మహిళపై ఏకంగా తండ్రీ కొడుకులు కన్నేశారు.

అంతేకాదు వారిద్దరూ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించారు. దీని కోసం ఆమెపై చాలా ఒత్తిడి తెచ్చారంట. అయితే ఆ మహిళ అందుకు ఒప్పుకోకపోవడంతో తనని చాలా దారుణంగా వేధించారంట.

ఆమెపై భౌతిక దాడి కూడా చేశారంట. అదీ కూడా పట్టపగలు నడిరోడ్డుపై ఈ పని చేయడంతో స్థానికులు ఈ సంఘటనను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ తండ్రీ కొడుకులను పట్టుకున్నారా? లేదా వారు పారిపోయారా అనే దానిపై ఆరా తీయగా వారి గురించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయంట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం రండి...

మహిళపై కన్ను..
బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లా మెన్ హర్ పోలీస్ స్టేషనులో వాచ్ మెన్ గా పని చేస్తున్న జగన్ పాశ్వాన్, అతని కొడుకు ధర్మేంద్ర పాశ్వాన్ అదే ప్రాంతానికి చెందిన ఒక మహిళపై కన్నేశారంట.

దాని కోసం ఒత్తిడి..
వావి వరసలు మరచిని ఆ తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి అదే మహిళతో రతి క్రీడలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారట. తమతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చారంట.

నడిరోడ్డుపై వేధింపులు..
తాము కోరుకున్నట్టు ఆమె తమ కోరికను తీర్చకపోవడంతో సదరు మహిళను నడిరోడ్డుపై గొడ్డును బాదినట్టు బాదేశారంట. దీంతో ఆమె ఆ దెబ్బలకు మతిస్థిమితం కోల్పోయిందట.

వారితో చెప్పడంతో..
దీన్ని గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వారు ఆమెను ఏమి జరిగిందని అడిగితే.. జరిగిన విషయం వారితో చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శారీరక సంబంధాలు..
ఈ తండ్రీ కొడుకులకు పలువురు మహిళలతో శారీరక సంబంధాలున్నాయని, తన భార్య అందుకు ఒప్పుకోలేదని, ఆమెను తీవ్రంగా హింసించారని, భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.



Click it and Unblock the Notifications