Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఒకే మహిళపై మనసు పారేసుకున్న తండ్రీ కొడుకులు... చివరికి ఏం జరిగిందంటే...
బీహార్ రాష్ట్రంలో ఒకే మహిళపై మనసు పారేసుకున్న తండ్రి కొడుకులు చివరకు ఏం చేశారో చూడండి...
మన దేశంలో బంధాలు, అనుబంధాలకు ఎంతో విలువ ఉంది. ఆప్యాయన, అనురాగాలకు మన భారతదేశాన్ని పుట్టినిల్లుగా ఎందరో విదేశీయులు ప్రశంసిస్తుంటారు. ఇంత పెద్ద దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా సాధ్యమా అని ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు.

అయితే ప్రస్తుతం మన దేశంలో కూడా వావి వరసలు మరిచిపోతున్నారు కొందరు ప్రబుద్ధులు. ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయంలో రోజురోజుకు చిత్ర విచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇటీవలే తెలంగాణలో వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి 9 మందిని హత్య చేసిన సంగతిని మరువకముందే... బీహార్ లో మరో దారుణం చోటు చేసుకుంది. అక్కడ ఓ మహిళపై ఏకంగా తండ్రీ కొడుకులు కన్నేశారు.

అంతేకాదు వారిద్దరూ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించారు. దీని కోసం ఆమెపై చాలా ఒత్తిడి తెచ్చారంట. అయితే ఆ మహిళ అందుకు ఒప్పుకోకపోవడంతో తనని చాలా దారుణంగా వేధించారంట.

ఆమెపై భౌతిక దాడి కూడా చేశారంట. అదీ కూడా పట్టపగలు నడిరోడ్డుపై ఈ పని చేయడంతో స్థానికులు ఈ సంఘటనను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ తండ్రీ కొడుకులను పట్టుకున్నారా? లేదా వారు పారిపోయారా అనే దానిపై ఆరా తీయగా వారి గురించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయంట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం రండి...

మహిళపై కన్ను..
బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లా మెన్ హర్ పోలీస్ స్టేషనులో వాచ్ మెన్ గా పని చేస్తున్న జగన్ పాశ్వాన్, అతని కొడుకు ధర్మేంద్ర పాశ్వాన్ అదే ప్రాంతానికి చెందిన ఒక మహిళపై కన్నేశారంట.

దాని కోసం ఒత్తిడి..
వావి వరసలు మరచిని ఆ తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి అదే మహిళతో రతి క్రీడలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారట. తమతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చారంట.

నడిరోడ్డుపై వేధింపులు..
తాము కోరుకున్నట్టు ఆమె తమ కోరికను తీర్చకపోవడంతో సదరు మహిళను నడిరోడ్డుపై గొడ్డును బాదినట్టు బాదేశారంట. దీంతో ఆమె ఆ దెబ్బలకు మతిస్థిమితం కోల్పోయిందట.

వారితో చెప్పడంతో..
దీన్ని గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వారు ఆమెను ఏమి జరిగిందని అడిగితే.. జరిగిన విషయం వారితో చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శారీరక సంబంధాలు..
ఈ తండ్రీ కొడుకులకు పలువురు మహిళలతో శారీరక సంబంధాలున్నాయని, తన భార్య అందుకు ఒప్పుకోలేదని, ఆమెను తీవ్రంగా హింసించారని, భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.



Click it and Unblock the Notifications











