Latest Updates
-
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.?
కూతురికి కాబోయే భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న తల్లి.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్
ఓ తల్లి..తన కూతురికి కాబోయే భర్తతో లేచిపోయిన ఘటన గత వారం పెద్ద హైలెట్ అయిన విషయం తెలిసిందే. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపి భర్తతో సంతోషంగా ఉండాలని దీవించాల్సిన తల్లి ఆమె కాబోయే భర్తతోనే పెళ్లికి 10 రోజుల ముందు జంప్ అవడం దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ లో జరిగిన ఈ ఘటనలో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ వచ్చింది.
అలీఘర్ సిటీలోని దాదోన్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని నివసించే సప్న, జితేంద్ర కుమార్ భార్యాభర్తలు. వీరికి శివానీ అనే ఓ కూతురు ఉంది. పెళ్లి వయస్సుకి వచ్చిన తమ కూతురు శివానీకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ క్రమంలో రాహుల్ కుమార్ అనే యువకుడితో శివానీకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. మరో 10 రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా ఏప్రిల్ 6,2025న 40 ఏళ్ల సప్న..తనకు కాబోయే అల్లుడు రాహుల్ కుమార్ తో జంప్ అయింది.

తన కూతురు శివానీకి పెళ్లి సంబంధం కుదిరినప్పటి నుంచి కాబోయే అల్లుడితో ఫోన్ లో సప్నా గంటలపాటు మాట్లాడేదని, ఇంట్లో ఉన్న 3.5 లక్షల రూపాయల డబ్బు, 5 లక్షల రూపాయల విలువైన నగలతో కాబోయే అల్లుడితో తన భార్య పారిపోయిందని ఆమె భర్త జితేంద్ర కుమార్,కూతురు శివానీ ఆ సమయంలో చెప్పారు. కట్ చేస్తే ఏప్రిల్ 16న సప్నా,రాహుల్ కుమార్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యారు.
కూతురికి కాబోయే భర్తతో ఎందుకు లేచిపోవాల్సి వచ్చిందో సప్న పోలీసులకు వివరించింది. తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతు అని,తరుచూ తాగొచ్చి తనను కొట్టేవాడని..తన కూతురు కూడా తరచూ తనతో గొడవలు పెట్టుకునేదని..అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సప్న తెలిపింది.ఏది ఏమైనా కూడా తాను రాహుల్ తో జీవిస్తానని,అతడిని పెళ్లి చేసుకుంటానని సప్నా తెలిపింది. తాను ఇంట్లొ నుంచి వెళ్లేటప్పుడు డబ్బు,బంగారం ఎత్తుకెళ్లినట్లు తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని..తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తన దగ్గర కేవలం ఓ మొబైల్ ఫోన్,రూ.200 మాత్రమే ఉన్నట్లు సప్న చెప్పింది.
తనతో సంబంధానికి ఒప్పుకోకుంటే చనిపోతాను అని సప్న బెదిరించడంతోనే తాను ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ చెప్పాడు. అలీఘర్ బస్ స్టాప్ లో నన్ను ఈ రోజు కలవకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటాను అని సప్న తనకు ఫోన్ లో చెప్పిందని..దీంతో తాను అక్కడికి వెళ్లానని..ఆ తర్వాత ఇద్దరం లక్నో వెళ్లామని..అక్కడి నుంచి ముజఫర్ ఫూర్ వెళ్లామని రాహుల్ చెప్పారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారు అని తెలియడంతో తామే వచ్చి లొంగిపోయినట్లు చెప్పాడు.
అయితే ఇప్పుడు సప్నాని పెళ్లి చేసుకుంటావా అని అడినప్పుడు..అలాంటిదేమీ లేదని రాహుల్ మొదట చెప్పాడు..అయితే మళ్లీ కొద్దిసేపటి తర్వాత చేసుకుంటా అని రెండు రకాలుగా చెప్పాడు. అయితే సప్నని తిరిగి ఇంట్లోకి రానిచ్చేది లేదని, తీసుకెళ్లిన డబ్బు, నగలు తిరిగిచ్చేస్తే చాలు అని ఆమె కుటుంబ సభ్యులు తెగేసి చెప్పారు. భర్త తాగొచ్చి కొడుతున్నాడు అని సప్న చెప్పిన మాటలు మొత్తం పచ్చి అబద్దమని సప్న తమ్ముడు దినేష్ చెప్పారు.



Click it and Unblock the Notifications