భర్తను నగ్నంగా మంచానికి కట్టేసిన భార్య, సీసీటీవీల్లో సినిమా స్టోరీ మొత్తం రికార్డు, రివర్స్ స్టోరి

సుమారు కొన్ని ఏళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి మరెవరికి చెప్పుకోలేని విధంగా అతని భార్య చిత్రహింసలకు గురిచేసిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం. తన భర్తను వివస్త్రను చేసి అతని ప్రైవేట్ భాగాలకు హాని చేసిన భార్య ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. భార్య పెట్టిన చిత్రహింసలకు భర్త ఆసుపత్రిపాలైనాడు.

భర్త అతని భార్యను వేధింపులకు గురి చేశాడని, చిత్రహింసలు పెట్టాడని, ఆమెకు నరకం చూపించాడని ఇంతకాలం మీరు వినివుంటారు. అయితే ఇక్కడ ఓ మహిళ ఆమె భర్తకు సినిమా చూపించింది. సమాజంలో జరుగుతున్న సంఘటనలకు రివర్స్ లో ఈ సంఘటన జరిగింది. అసలు విషయం ఏమిటంటే మద్యం మత్తులో భర్త ప్రైవేట్ పార్ట్ కు అతని భార్య హాని చెయ్యడమే కాకుండా భర్త పడుతున్న ఆవేదనను ఆమె చూస్తూ సైకోలాగా ఎంజాయ్ చేసింది.

The wife tied her husband to the bed in the bedroom

తాను పడిన కష్టాన్ని భర్త పోలీసుల ముందు వివరించడంతో పోలీసు అధికారులు సైతం షాక్ అయ్యారని స్థానిక మీడియా తెలిపింది. ఓ ముస్లిం మహిళ, ఓ వ్యక్తి ప్రేమించుకున్నారు. ప్రేమపక్షులు ఇంతకాలం హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఏడు నెలల క్రితం ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం తన ప్రేమికుడిని ఆమె వివాహం చేసుకుంది. అయితే ఆమె తన భర్తను బెడ్ రూమ్ లోనే చిత్రహింసలకు గురిచేసేది. భార్య పెడుతున్న చిత్రహింసలు తట్టుకోలేక భర్త బెడ్ రూమ్ లో సీసీటీవీలు కూడా అమర్చాడు.

మంచానికి భర్త కాళ్లు, చేతులు కట్టేసి భార్యను లైంగికంగా వేధించిన ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో గత నెల ఏప్రిల్ నెల చివరి వారంలో జరిగింది. అయితే వారం రోజుల తరువాత ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లేటుగా వచ్చినా ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏప్రిల్ 24వ తేదీన ఈ ఘటన జరిగిన రోజు ఎప్పటిలాగే బెడ్‌రూమ్‌లో ఉన్న భార్య లోపలికి వచ్చిన ఆమె భర్త తాగేందుకు ఇచ్చిన పాలలో మత్తు మందు కలిపి ఇచ్చింది.

మత్తు మందు కలిపిన పాలు తాగిన మైకంలో భర్త మంచం మీద పడిపోయాడు. తరువాత భార్య ఆమె భర్త చేతులు, కాళ్లను మంచానికి కట్టేసింది. అనంతరం భర్తకు బట్టలు విప్పి పక్కనే కూర్చున్న అతని భార్య సాఫీగా మద్యం సేవించింది. మత్తు మందు కలిపిన పాలు తాగి మైకంలో ఉన్న భర్త ప్రైవేట్ పార్ట్ లను చేతులతో తాకిన భార్య నవ్వుతూ అతన్ని చిత్రహింసలు పెట్టింది. ఇది చాలక మద్యం మత్తులో సిగరెట్ తాగిన భార్య ఆమె భర్త ప్రైవేట్ పార్ట్స్ ను విచక్షణా రహితంగా అదే సిగరెట్ తో కాల్చేసింది.

తరువాత భార్యకు పైత్యం ఎక్కువ కావడంతో కత్తితో భర్త ప్రైవేట్ పార్ట్ లను కూడా డ్యామేజ్ చేసింది. ఆమె తన భర్త ప్రైవేట్ పార్ట్ ను, శరీరంలోని సున్నితమైన భాగాలను కత్తితో గాయపరచి వికృతమైన ఆనందాన్ని అనుభవించింది. ఈ విషయమై బాధితుడు అయిన భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదైంది. పెళ్లి చేసుకున్న తర్వాత తన కొడుకు నిత్యం చిత్రహింసలు అనుభవించాడని అతని తల్లి, అత్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు సైకో భార్యను అదుపులోకి తీసుకున్నారు. భార్య ఆమె భర్తను చిత్రహింసలు పెడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యింది. భార్య చిత్రహింసలు తట్టుకోలేని భర్త అతని బెడ్ రూమ్ లో సీసీటీవీ కెమెరాలను అమర్చాడు. తాను అనుభవించిన చిత్రహింసల దృశ్యాలను భర్త పోలీసుల ఎదుట చూపించాడు. దంపతుల బెడ్ రూమ్ లోని సీసీటీవీ క్లిప్పింగ్స్ చూసిన పోలీసులు సైతం షాక్ అయ్యారని తెలిసింది.

భర్త చేతులు కాళ్లను బెడ్‌పై కట్టేసి అతని అరుపులు బయట వినపడకుండా నోటిలో బట్టలు కుక్కుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు. భర్త నోటికి గుడ్డతో కట్టేయడంతో నొప్పితో భర్త అరుస్తున్న శబ్ధం సీసీటీవీ ఫుటేజీలో వినిపిస్తోందని పోలీసు అధికారులు తెలిపారు. మానసిక, శారీరక హింసకు గురైన భర్తను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బిజ్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి భర్తను చిత్రహింసలకు గురి చేసిన భార్యను అరెస్టు చేశారు.

Story first published: Tuesday, May 7, 2024, 15:14 [IST]
Desktop Bottom Promotion