Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.!
మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శక్తి స్వరూపిణిలుగా కొలిచే లక్ష్మీ దేవి పూజకు శ్రావణ మాసంలో ప్రాధాన్యత ఎక్కువ. అదేవిధంగా ఆ మాసంలో శివారాధనకు, శివ పూజకు అత్యంత విశిష్టత ఉంది. ఉపవాసాలు, ప్రత్యేక పూజలతో మహిళలు శివుడిని ఆరాధిస్తారు. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు కెరీర్ కోసం, సరైన జీవిత భాగస్వామి కోసం పరమేశ్వరుడిని పూజిస్తుంటారు. అయితే అవివాహితులు శివ పూజ సమయంలో తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవేంటి.. పూజా నియమాలు ఏంటి తెలుసుకుందాం..

శ్రావణ మాసంలో మంగళ గౌరీ పూజతో పాటు శివారాధనకు భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ శ్రేయస్సు, దీర్ఘ సుమంగళిగా ఉండేందుకు మహిళలు ఉపవాసాలు చేస్తారు. ఇక అవివాహితులు మంచి జీవిత భాగస్వామిని ప్రసాదించమని కోరుకుంటూ ఉపవాసం, పూజల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో అవివాహుతులు తెలిసీతెలియక చేసే పొరపాట్ల కారణంగా శివారాధన పూర్తి ప్రయోజనాలు పొందలేరు. సరైన నియమాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం..
వీటిని వాడకండి..
శివారాధనలో శివలింగానికి అభిషేకాలు, పూజలకు విశిష్టత ఉంది. అయితే పూజ చేసేటప్పుడు అవివాహితులు శివలింగానికి పసుపు, కుంకుమ సమర్పించకూడదు. పసుపు, కుంకుమ స్త్రీతత్వానికి చిహ్నం. అందుకే ఈ రెండింటినీ పార్వతీదేవికి, గౌరీ పీఠానికి మాత్రమే సమర్పించాలి. శివలింగానికి ఇవ్వకూడదు. మొగలి, తులసి ఆకులను శివ పూజలో ఉపయోగించకూడదు. ఈ ఆకులు నిషిద్ధం. అవివాహితులు పార్వతీ దేవికి పసుపు, కుంకుమ సమర్పించి.. శివునికి కేవలం నీరు, చందనంతో మాత్రమే పూజించాలి.
ఈ వస్తువులు వద్దు
శివారాధానలో ఉపయోగించే వస్తువులు శుభ్రంగా, చెక్కు చెదరకుండా ఉండాలి. విరిగిన వస్తువులు, చిరిగిన బిల్వ పత్రాలు, విరిగిన బియ్యపు గింజలు పూజలో ఉంచకూడదు. ఇలాంటి వాటిని ఉంచడం ద్వారా పూజలో ఆశించిన ఫలితాలు పొందలేరు. శివలింగానికి సమర్పించే నీరు, పువ్వులు కూడా పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉండాలి. సంపూర్ణ భక్తితో పూజించడం ద్వారా నిస్వార్థమైన కోరికలు నెరవేరుతాయి.

అర్ధ ప్రదక్షిణ
పరమేశ్వరుడి పూజ అనంతరం శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. శివలింగం చుట్టూ ఎప్పుడూ పూర్తిగా ప్రదక్షిణ చేయకూడదు. అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. శివలింగంపైన నీరు ప్రవహించే ప్రాంతాన్ని దాటకూడదని పండితులు సూచిస్తున్నారు. ప్రదక్షిణ చేసేటప్పుడు జలధారి వద్దకు వెళ్లి అక్కడి నుంచే వెనుదిరగాలి. ఈ నిర్దిష్ట నియమాలు పాటిస్తూ శివుడిని పూజించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మంగళ గౌరీ పూజలోనూ నిష్టగా, నిస్వార్థంగా ఉండి పూజిస్తూ ఉంటే అమ్మవారి ఆశీస్సులు అందుకుంటారు.



Click it and Unblock the Notifications
