Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
Maha Shivratri 2023: ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శివాలయాలు, మహా శివరాత్రికి తప్పక వెళ్లండి
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహా శివరాత్రి, శైవ భక్తులతో పాటు ప్రతి ఒక్కరికీ అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు శైవాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడతాయి.హిందూ క్యాలెండర్ ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో మాఘ మాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు, మరికొన్ని ప్రాంతంలో ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన అంటే శనివారం నాడు మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం. శివ భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మహా పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తుల విశ్వాసం.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీశైలం మల్లికార్జున ఆలయం:
ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం మల్లికార్జున ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున దేవాలయాన్ని శ్రీశైలం దేవాలయం అంటారు. శ్రీశైలం మల్లికార్జున ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. పార్వతీ దేవి యొక్క 18 శక్తి పీఠాల్లో శ్రీశైలం ఒకటి.
నల్లమల కొండల అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. ప్రధాన మందిరం చుట్టూ అనేక చిన్న దేవాలయాలు ఉంటాయి. ఆలయ సముదాయంలో అనేక మందిరాలు, మండపాలు ఉంటాయి.

శ్రీకాళహస్తి:
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీకాళహస్తి ఆలయమని అంటారు. చిత్తూరు జిల్లాలో ఉంటుంది. శివుని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈ ఆలయాన్ని కాళా ఋషి నిర్మించాడని చెబుతారు.
శ్రీకాళహస్తి ప్రత్యేకత స్పటిక లింగం. ఈ స్పటిక లింగం సహజంగా ఏర్పడిందని చెబుతారు. దక్షిణ భారత్ లోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి.

శ్రీభీమేశ్వర స్వామి దేవాలయం, ద్రాక్షారామం:
ద్రాక్షారామంలో శ్రీభీమేశ్వర స్వామి దేవాలయం. తూర్పు గోదావరి జిల్లాలో ఉంటుంది. ప్రధాన క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. పంచారామ క్షేత్రాల్లో ద్రాక్షారామం ఒకటి. పురాణాల ప్రకారం భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత ముఖ్యమైనక పుణ్య క్షేత్రాల్లో ఒకటి ఈ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం.

నీలకంఠేశ్వర ఆలయం, అంతర్వేది:
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది నీలకంఠేశ్వర స్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలో పవిత్రమైన పుణ్యక్షేత్రం పరిగణిస్తారు. అంతర్వేది వద్ద ప్రకృతి రమణీయత కట్టిపడేస్తుంది. ఇక్కడ ప్రాణహిత పుష్కరిణి చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి తమ కోర్కెలు నెరవేరాలని శివుడిని ప్రార్థిస్తారు.

కపిల తీర్థం, తిరుమల:
తిరుమల కొండపై ఉంటుంది కపిల తీర్థం. పవిత్రమైన శైవ పుణ్యక్షేత్రాల్లో కపిల తీర్థం కూడా ఒకటి. ఇక్కడి ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటుంది. శివుడు కపిల తీర్థం వద్ద వేల సంవత్సరాల పాటు ధ్యానం చేసినట్లు చెబుతారు. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం చాలా మందిని ఆకట్టుకుంటుంది. పిక్నిక్ లు, ప్రకృతి నడకలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఇది.



Click it and Unblock the Notifications