Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే!
పుట్టపర్తితో వెనిజులా బంధం..నాటి ప్రెసిడెంట్ మదురో నుంచి నేటి ప్రెసిడెంట్ డెల్సీ వరకు అందరూ సాయి భక్తులే!
అమెరికాలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారంటూ,అమెరికా వ్యతిరేక చర్యలు చేపడుతున్నారన్న ఆరోపణలతో గత వారం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అమెరికా ప్రత్యేక బలగాలు వెనిజులా రాజధాని కారకోస్ లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి మదురో,ఆయన భార్యను కూడా బంధించి అమెరికా తీసుకెళ్లారు.
అయితే మదురో అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ తో ఆయనకు ఉన్న ప్రత్యేక అనుబంధంపై సోషల్ మీడియాలో ఫొటోలు,వీడియోలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయ్యాయి. మదురో,ఆయన భార్య పుట్టపర్తి సాయిబాబా భక్తులు కాగా, గతంలో మదురో దంపతులు పుట్టపర్తి వచ్చి శ్రీ సత్యసాయిని దర్శించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మదురో ఆఫీసులో కూడా సత్యసాయి ఫొటో ఉండేదని సమాచారం. మదురోకు వివాహానికి ముందే తన భార్య ద్వారా సత్యసాయితో పరిచయం ఏర్పడింది. 2005లో మదురో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు, దంపతులిద్దరూ పుట్టపర్తికి వచ్చి సత్యసాయిని దర్శించుకున్నారు.
ప్రస్తుత ప్రెసిడెంట్ కూడా బాబా భక్తురాలే
ఇదిలాఉంటే, మదురోని అమెరికా అరెస్ట్ చేసిన తర్వాత వెనిజులాకు అప్పటివరకు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్
ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించింది ఆ దేశ సుప్రీం కోర్టు.
విశేషం ఏంటంటే డెల్సీ రోడ్రిగ్స్ కూడా పుట్టపర్తి సాయి భక్తురాలే. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వెనిజులా నూతన అధ్యక్షురాలికి, మన ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తికి విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పుట్టపర్తి బాబాకు పరమ భక్తురాలు
డెల్సీ రోడ్రిగ్స్ వెనిజులా ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలోనే పలుమార్లు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిని సందర్శించారు. సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ముఖ్యంగా 2023 ఆగస్టులో, ఆ తర్వాత 2024 అక్టోబర్ లో ఆమె పుట్టపర్తికి విచ్చేసి ఆశీస్సులు తీసుకున్నారు.
ప్రశాంతి నిలయంలో ఆధ్యాత్మిక అనుభూతి
గత ఏడాది అక్టోబర్ 26న డెల్సీ రోడ్రిగ్స్ పుట్టపర్తికి వచ్చినప్పుడు ఆమెతో పాటు భారత్ లోని వెనెజువెలా రాయబారి కాపయా గొంజాలెజ్ కూడా ఉన్నారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఆమెకు సాదర స్వాగతం పలికి, ఆశ్రమంలోని విశేషాలను వివరించారు. ఆశ్రమంలోని గర్భగుడి, శాంతి భవన్ లలో ఆమె గడిపారు.

బాబా దివ్య సన్నిధిలో గడపడం నాకు ఎంతో మానసిక ప్రశాంతతను, శాంతిని ఇచ్చింది అని ఆమె ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు భారత్కు వచ్చి పుట్టపర్తిని సందర్శించడం బాబా పట్ల ఆమెకున్న అపార నమ్మకానికి నిదర్శనం. ప్రస్తుతం ఆమె పాత పర్యటనలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వెనిజులాలో భారతీయ ఆధ్యాత్మికత
వెనిజులాలో సత్యసాయి బాబా సేవా కేంద్రాలతో పాటు బ్రహ్మ కుమారీలు, రాధా స్వామి వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక సంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశ పగ్గాలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్స్ కూడా సాయి భక్తురాలిగా ఉండటం, భారతీయ ఆధ్యాత్మికత సరిహద్దులు దాటి విశ్వవ్యాప్తమైందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.



Click it and Unblock the Notifications











